చిత్తూరు
సాహిత్య అధ్యయనంతో ఉత్తమ వ్యక్తిత్వం*
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తిరుపతి, ఆగస్టు 11: సాహిత్య అధ్యయనం ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవరుస్తుందని విద్యాపీఠం కులపతి ఆచార్య ఎం. ఎల్ నరసింహమూర్తి అన్నారు. గురువారం స్థానిక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో అన్నమాచార్య సాహిత్య కళాపరిషత్ తులసీదాస్ హిందీ పరిషత్ వార్షికోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉపన్యాస విద్యతో నిష్ణాతులయ్యేందుకు ఈరెండు వేదికలు ఎంతో దోహదపడుతాయన్నారు.
అంతేకాక హిందీ,తెలుగు భాషల వైశిష్ట్యాలను ఆయన విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించిన అకడమిక్ డీన్ ఆచార్య రాధాకాంత్ ఠాకూర్ ప్రసంగిస్తూ పోతన భాగవతం, తులసీదాస్రామాయణం ప్రజల భాషలోరాసిన భక్తికావ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య సాహిత్య కళాశాల పరిషత్ సమన్వయకర్త డాక్టర్ డి.మల్లన్న, తులసీ దాస్ హిందీ పరిషత్ సమన్వయ కర్త డాక్టర్ టి. లతామంగేష్, తెలుగు విభాగం ఉపన్యాసకులు డాక్టర్ వై. విజయలక్ష్మి, హిందీ విభాగం అధ్యాపకులు డాక్టర్ మోహన్నాయుడు, జి. లక్ష్మీనారాయణ, డాక్టర్ జె. చక్రవర్తి, డాక్టర్ శే్వతపద్మ, డాక్టర్ రంగరామానుజాచార్యులు, డాక్టర్ ముఖరన్న, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.