చిత్తూరు

స్విమ్స్‌లో ఘనంగా ఫ్రీడమ్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 23: స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ మహిళా వైద్య కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్, విసి డాక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. యుజిసి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థుల్లో దేశభక్తిని పెంచామన్నారు. మహిళా వర్సిటీ కళాశాల విద్యార్థులు, పారామెడికల్ విద్యార్థి, విద్యార్థినులు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శరణ్ బి సింగ్, డాక్టర్ అంజు, డాక్టర్ భాస్కర్‌రెడ్డి, ఆనందబాబు, భూపాల్, సుదర్శన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృత విద్యాపీఠంలో...
సంస్కృత విద్యాపీఠంలో మంగళవారం యుజిసి ఆదేశాల మేరకు ఆజాదీ-70 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ గీతాన్ని ఆలపించారు. విసి ఆచార్య ఎంఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని జాతీయ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. అంతకుముందు సంస్కృత విద్యాపీఠంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ ఆరెకె ఠాకూర్, ఆచార్య ఎస్‌ఎస్ శర్మ, ఆచార్య సిహెచ్ సత్యనారాయణ, ఆచార్య ఓఎస్ రామ్‌లాల్, ఆచార్య పివి జడిపాల్, ఆచార్య ఆర్‌కె శుక్లా, ఆచార్య జోషి, ఆచార్య సదాశివమూర్తి, డాక్టర్ సి రంగనాథన్, డాక్టర్ గిరినాయుడు, డాక్టర్ గిరికుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ విజి శ్రీనివాసులు రెడ్డి, పిఆర్‌వో డాక్టర్ ఎస్ దక్షిణామూర్తిశర్మ తదితరులు పాల్గొన్నారు.