చిత్తూరు

శ్రీవారి ఆలయం తరహాలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జిత సేవా టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 1: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్యం జరిగే ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్ల జారీని మరింత సరళతరం చేయనున్నట్లు టిటిడి తిరుపతి జెఇఓ పోలాభాస్కర్ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె ఇ ఓ మట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవల తరహాలోనే అమ్మవారి ఆలయంలో సేవా టిక్కెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యపూజలు, వారపుసేవలు, వార్షిక సేవలు భక్తులకు అందుబాటులో ఉండేందుకు ఈ-దర్శన్ కౌంటర్‌లో లభ్యమయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు తగిన విధంగా ఐ టి అప్లికేషన్ రూపొందించాలని సూచించారు. శ్రీ పద్మావతి అమ్మవారి సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. అదేవిధంగా అమ్మవారి ఆలయం ముందు సేవలను సంబంధించిన వివరాలతో కూడిన ప్రదర్శన బోర్డులను ఏర్పాటుచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. తద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని తెలిపారు. వచ్చే గురువారం నుంచి అమ్మవారి ఆలయంలో నిర్వహించే తిరుప్పావడ సేవకు టిక్కెట్లను బుధవారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మవారి ఆలయం ముందు ఏర్పాటుచేసిన సేవా టిక్కెట్ల కౌంటర్ వద్ద క్యూలైన్ల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఇ ఓ చిన్నంగారి రమణ, ఇ ఇ వేణుగోపాల్, డిప్యూటీ ఇ ఇ ఉమాశంకర్, సి ఎ ఓ రవిప్రసాద్, ఎవి అండ్ ఎస్ ఓ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.