చిత్తూరు

‘ప్రత్యేక హోదా సాధనలో పవన్ రథసారథి కావాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసగించిన నేపథ్యంలో ప్రత్యేకహోదా సాధనలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రథసారథి కావాలని, జనచైతన్యానికి నాంది ప్రస్తావన చేయాలని రాయలసీమ పోరాటసమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద పవన్‌కల్యాణ్ రావాలి -ప్రత్యేక హోదా తేవాలి, ప్రత్యేకహోదా సాధనలో రథసారధి కావాలంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా హామీలిచ్చిన బిజెపి, టిడిపిలు అధికారంలోకి రాగానే ఆ హామీలను తుంగలో తొక్కారన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దగా చేశారన్నారు. మాట తప్పిన బిజెపి, టిడిపిలకు తగిన గుణపాఠం చెప్పేలా పవన్‌కల్యాణ్ శంఖారావం పూరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుగు ప్రజల మధ్య ప్రత్యేక హోదాపై జరుగుతున్న ధర్మపోరాటానికి పవన్ రథసారధి కావాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరీ అడ్డుపడి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుల అన్న పవన్‌కల్యాణ్ ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి ప్రత్యక్ష పోరాటానికి శమరశంఖం పూరించాలన్న నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో భువన్‌కుమార్, వెంకట, సురేష్, నందగోపాల్, చిన్న, రమేష్, రాజగోపాల్, అన్షర్, అమర్, ప్రసన్న, రాజశేఖర్, ఉమాశంకర్‌రెడ్డి, అనిల్, బాబు, నిరంజన్‌రాజు, పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు.