జాతీయ వార్తలు
అమర్నాథ్ యాత్ర నిలిపివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో ఆందోళనకారులకు, భద్రతాసిబ్బందికి మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్ గుండా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. కశ్మీర్ లోయ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ కీలక ఉగ్రవాది బుర్హాన్ వనీ పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో శ్రీనగర్ సహా పలు చోట్ల కర్ఫ్యూ విధించారు. శుక్రవారం రాత్రి అనంతనాగ్లోని కొకేర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. దీంతో కొందరు వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి వాహనాల టైర్లు తగలబెట్టారు. అల్లర్ల కారణంగా పోలీసులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అనంతనాగ్, పుల్వామా, షోపియాన్, సోపోర్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు.