ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 25: నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం మధ్యాహ్నం ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు గవర్నర్ దంపతులకు అమ్మవారి రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాలతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆస్థాన మండపంలో వీరికి అర్చకులు అమ్మవారి దివ్య ఆశీస్సులు అందజేశారు.