జాతీయ వార్తలు

ఢిల్లీలోని సిపిఎం కార్యాలయంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఢిల్లీలోని గోల్ మార్కెట్‌లో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయ బోర్డు మీద ‘పాకిస్తాన్ ఆఫీసు’ అని నల్లటి ఆయిల్‌తో రాసారు. ఆ సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందులో ఒక వ్యక్తిని సిపిఎం కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడి వెనుక కారణాలు ఎమిటి? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో సిపిఎం కార్యాలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఘటనను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిచాయి.