ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ బావిలో తల్లీబిడ్డల మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మార్చి 11: ఓ తల్లీబిడ్డ వ్యవసాయబావిలో శవాలుగా ప్రత్యక్షమైన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ దిగువమామిడిగుంతలపల్లెకు చెందిన సోమశేఖర్‌రెడ్డి కవిత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త మద్యానికి బానిసై నిత్యం డబ్ముకోసం భార్యను వేధించేవాడు. ఈక్రమంలో ఈనెల 6న దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అల్లుడు సోమశేఖర్‌రెడ్డి, భార్య తండ్రికి ఫోన్‌చేసి ఇంటిలో తగువుపడిందని, ఇంటినుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. దీంతో తండ్రి కుటుంబసభ్యులతో కలిసి బంధువులు, దూరపుబంధువుల ఊర్లన్నీ వెతికాడు. నా కుమార్తె, మనవడు కన్పించడం లేదని మంగళవారం మదనపల్లె రూరల్ పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో మదనపల్లె పోలీసులు బుధవారం కేసునమోదు చేశారు. గురువారం సాయంత్రం సమయంలో తల్లిబిడ్డల మృతదేహాలు మామిడిగుంతలపల్లె సమీపంలోని వ్యవసాయ బావిలో శవాలై కన్పించాయి. శుక్రవారం ఉదయం మృతదేహాలను వెలికి తీశారు. తన బిడ్డను అల్లుడే చంపేశాడని మృతురాలి తండ్రి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.