Others

దీపం.. లక్ష్మీస్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెల 25 కార్తిక పున్నమి సందర్భంగా
===================
లక్షబిల్వార్చన, లక్షవత్తుల నోము, లక్ష రుద్రం, వృషవ్రతం,మహీఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరధ పూర్ణిమా వ్రతం, కృత్తికా వ్రతం, మున్నా ట అరవై వత్తులను, ఉసిరికలపై దీపాలు వెలిగిం చటం అనే వ్రతాలకు, నోములకు ఖ్యాతి గాంచిన కార్తికం దీపదానం వస్త్ర దానం, అన్నదానం ఇలా ఏ దానం చేసినా రెట్టింపు ఫలాన్ని స్తుందనే ప్రసిద్ధి పొందింది.
చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమిమిక్కిలి శ్రేష్ఠమైనది. ఈ రోజున రాత్రి అంతా వెనె్నలతో పొటీ నా అన్నట్టు శివాలయాలు, వైష్ణవాల యాలన్న తేడా లేకుండా ప్రతి ఆలయ ప్రాంగణం, జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా దీపాలంకరణ తో దేదీప్య మానంగా ప్రకాశిస్తుంటాయ. కార్తీక పౌర్ణమినాడు వేకువజామునే దీపారాధన చేసి వాటిని అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతారు. కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.
మహోన్నతమైన కార్తికం శివకేశవులి ద్దరికీ అత్యంత ప్రియమైంది. కాసిని నీళ్లు ఇచ్చినా, ఆర్తిగా స్మరించినా, ప్రేమగా పండు ఇచ్చినా ఆఖరికి ఒక్క తులసీ దళం ఇచ్చినా నేను ఆ భక్తునకు వశుడిన వుతాను అని చెప్పిన కృష్ణ్భగవానుడికి మల్లె పరమశివుడు, శివాజ్ఞలేనిదే ఈ సృష్టిలో చీమైనా కుట్టదని కీర్తించే యోగీ శ్వరులకే యోగమూర్తి అయన పార్వతీ ప్రియుడు కాసిని నీళ్లు తనపై చిలకరించినా, గుడిలోనే కాదు ఎక్కడైనా కొడి గట్టబోయే దీపాన్ని కాస్త పైకి తోసి వెలిగేలా చేసినా, తెలయకుండా ఉపవాసం చేసినా, మారేడుపత్రం తనపై అనాలోచనంగా వేసినా సరే తన సాయుజ్యానికి రప్పించుకొనేవాడు పరమ దయాళుడైన పరమశివుడు. కార్తిక పున్నమినాడు శివకథలు విన్నా తరగని సంపదలను అను గ్రహించే భోళాశంకరుని స్మరించని వారు ఎవరూ ఉండరు. హింసాత్మకు లైన ఆ త్రిపురాసురులను సైతం పరమ శివుడు సంహరించిన రోజు కార్తిక పున్న మి. ముల్లోకాలను ఆ రాక్షసుల బాధ నుంచి విముక్తులను చేసిన పరమ శివుణ్ణి స్మరించు కుంటూ త్రిపుర పున్నమిగా కూడా ఈ రోజు శివపూజలు చేయడం పరిపాటి. కొన్ని చోట్ల పెళ్లికాని అమ్మాయిలు కార్త్తిక దీపాలను నదుల్లో వదిలి, రాత్రికి తులసి కోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. మరికొందరు లక్ష్మీస్వరూపంగా తులసి ని, విష్ణు స్వరూపంగా ఉసిరికను భావిం చి ఆ రెండు వృక్షాలను దగ్గరకు చేర్చి కార్తిక పున్నమినాడు తులసీ వివాహం చేస్తారు.
స్ర్తిలందరూ కార్తీక చలిమిళ్ల నోము నోస్తారు. ఈ నోముకోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. కృత్తికా దీపాల నోముకు పున్నమినాటి రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా... కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణ వచనం. పౌర్ణమినాడు ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుంది. శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి.
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహాలాన్ని లోకహితం కోరి పార్వతిదేవి అనుమతితో పరమేశ్వరుడు సేవించి గరళంలో బంధించి గరళకంఠునిగా కీర్తించబడింది ఈ పున్నమినాడే. తన భర్తకు ఏ ఆపద సంభవించనట్లయితే జ్వాలాతోరణం క్రింద నుంచి ముమ్మారు భర్తతో కూడి ప్రదక్షిణం చేస్తానని పార్వతి మ్రొక్కుతుంది. ఆనాటినుంచి ఈ పున్నమి రాత్రి ప్రతి శివాలయంలోనూ ‘జ్వాలాతోరణం’ కార్యక్రమం నిర్వహిస్తారు.
క్షీరసాగరమధనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కార్తిక పున్నమిగా భావించి ఈ రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. దీపాన్ని లక్ష్మీ స్వరూపం గా భావించి ఇల్లువాకిలినంతా దీపాలతో అలంకరించి లక్ష్మీపూజలు, ధాత్రీ పూజలు చేస్తారు.

- హనుమాయమ్మ