కృష్ణ

కోలాహలంగా జలవనరులశాఖ కార్యాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మంత్రి దేవినేనికి అభినందనల పరంపర
విజయవాడ, నవంబర్ 20: వివిధ ప్రభుత్వ శాఖలన్నింటి కంటే ముందుగా రాష్ట్ర జలవనరులశాఖ ప్రధాన కార్యాలయం నగరానికి చేరుకుంది. సిఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలో నిర్మితమైన భవనాల్లోకి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం పూజాదికాలు నిర్వహించి ప్రవేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు మంత్రికి పుష్పగుచ్ఛాలందించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎంపిలు కేశినేని శ్రీనివాస్ (నాని), కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు మంత్రిని అభినందించారు.