జాతీయ వార్తలు

భాజపాపై దిగ్విజయ్‌ ఎదురుదాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు ప్రజ్ఞా ఠాకూర్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కలవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ శుక్రవారం విమర్శలు చేశారు. ఇస్లాం బోధకుడు జకీర్‌ నాయక్‌తో 2012లో దిగ్విజయ్‌ వేదిక పంచుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై భాజపా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దిగ్విజయ్‌ ఎదురుదాడికి దిగారు. శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ జకీర్‌ నాయక్‌తో వేదిక పంచుకోవడంపై భాజపా ఎందుకు మాట్లాడడం లేదని, ప్రజ్ఞా ఠాకూర్‌ను హోం మంత్రి రాజ్‌నాథ్‌ ఎందుకు కలిశారని దిగ్విజయ్‌ ప్రశ్నించారు.