జాతీయ వార్తలు
ఆరుగురిని చంపిన వైద్యుడు..! : ఫాంహౌస్లో మృతదేహాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 August 2016
సతారా: మహారాష్ట్రలోని సతారాకు చెందిన డాక్టర్ సంతోష్ పాల్ నేర ప్రవృత్తితో ఆరుగురి ప్రాణాలు బలిగొన్నాడు. ఇటీవల ఓ మహిళ కన్పించకుండా పోయిన కేసులో సంతోష్పాల్ను అనుమానించి పోలీసులు అరెస్టు చేశారు. తాను ఇప్పటివరకు ఆరుగురిని చంపినట్లు పాల్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. పాల్ ఫాంహౌస్లో మృతుల అవశేషాలను పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఫాంహౌస్లోనే కాల్చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు.