తెలంగాణ

తండ్రీకొడుకుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, మార్చి 11: సేద్యం చేసుకునేందుకు వేసుకున్న బోర్లు భూగర్భజల వనరులు తగ్గి ఎండిపోవడం.. రైతులు బోర్ల పక్కన బోర్లు వేసుకుంటూ పోవడంతో వివాదాలు ఏర్పడడం.. వెరసి పరస్పర కక్షల కారణంగా తండ్రీకొడుకులు హతమయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆర్వపల్లి మండలం డి.కొత్తపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. సూర్యాపేట డిఎస్పీ అబ్ధుల్ రశీద్ తెలిపిన వివరాల ప్రకారం... డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల శ్రీనివాస్ (40), అతని కుమారుడు గైగుళ్ల వినయ్ (15) తండ్రీకొడుకులు వ్యవసాయ భూమివద్ద గురువారం రాత్రి బోరు మోటార్ పెట్టేందుకు వెళ్లి అక్కడే నిద్రపోయారు. వీరి వ్యవసాయభూమి పక్కనే ఉన్న పొరుగు రైతుల బోరు నీరులేక ఎండిపోవడంతో వారు వీరిపై కొంతకాలంగా కక్షలు పెంచుకున్నారు. దీంతో గైగుళ్ల శ్రీనివాస్ జనరేటర్ ఏర్పాటుచేయడంతోనే తమ బోరు ఎండిపోయిందని భావించి గురువారం అర్ధరాత్రి గైగుళ్ల వెంకటనారాయణ, గైగుళ్ల అవిలయ్య ఇరువురు అన్నదమ్ములు వ్యవసాయ బావివద్ద నిద్రిస్తున్న తండ్రీకొడుకులను మారణాయుధాలతో దాడిచేసి దారుణంగా హతమార్చారు. శుక్రవారం ఉదయం మృతుల బంధువులు మృతదేహాలను చూసి ఫిర్యాదుచేసినట్లు చెప్పారు.