ఆంధ్రప్రదేశ్‌

ఎవరూ వెళ్లవద్దు: తూ.గో జడ్పీ ఛైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 23: కాపులను ఉద్దరిస్తామంటూ త్వరలో కాపు గర్జనలు నిర్వహిస్తున్న నేతల వెంట ఎవరూ వెళ్లవద్దని తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు కోరారు. కాకినాడలో జరిగిన టిడిపి సమావేశంలో నామన మాట్లాడుతూ కాపులకు చంద్రబాబు ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన పర్వత చిట్టిబాబు ఓటమికి కారణమైన ఓ నాయకుడు నేడు కాపు గర్జన అంటూ బయలుదేరారని పరోక్షంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఆయన విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే 9వేల ఓట్లు తెచ్చుకున్న సదరు వ్యక్తి నేడు కాపులకు రిజర్వేషన్లు సాధిస్తారా? అని ప్రశ్నించారు. కాపుల ఐక్యతను దెబ్బతీసేవారి మాటలు నమ్మవద్దని రాంబాబు కోరారు.