సంపాదకీయం

ప్రయాణ ‘బలిపశువులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణ ‘మారీచ మృగం’ బలితీసుకొంటుండడం అసలు సమస్య. దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాల వారు ఈ ‘మారీచ మృగాన్ని’ ఇప్పటికీ ‘బంగారపు జింక’అని భ్రమిస్తున్నారు. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ కల్పించిన, కల్పిస్తున్న ‘ప్రగతి’భ్రాంతిని ‘నిజమైన ప్రగతి’అని భ్రమపడుతున్నారు. ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-ను ప్రపంచ దేశాలపైకి ‘ఉసికొలిపిన’ అమెరికా, ఐరోపా దేశాలు ఇప్పుడు ‘ప్రపంచీకరణ’ కబంధ బంధం నుంచి ‘విముక్త’లు కావడానికి యత్నిస్తున్నాయి, గింజుకొంటున్నాయి, గిలగిలలాడుతున్నాయి. ఎందుకంటె వాటి వ్యూహం బెడిసికొట్టడం ఇరవై ఆరేళ్ల ‘ప్రపంచీకరణ’ చరిత్ర. ప్రవర్ధమాన దేశాల ప్రజలను తాము, తమ దేశాల బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు- మల్టీ నేషనల్ కంపెనీస్- దోచుకోవాలన్నది అమెరికా, ఐరోపా ప్రభుత్వాల ‘ప్రపంచీకరణ’ వ్యూహం! ఇప్పుడు చైనా ‘వాణిజ్య సంస్థలు’ తమ దేశాలలోకి చొఱబడి పోతుండడం అమెరికా, ఐరోపా దేశాలకు నచ్చని ‘పరిణామం’. ఇదీ వారి వ్యూహం బెడిసికొట్టడం! ఇలా అంతర్జాతీయ గుణపాఠాలు వికృతంగా అవిష్కృతం అవుతున్నప్పటికీ మన దేశంలోని ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు మాత్రం గ్రహించడానికి సిద్ధంగా లేరు.. వ్యవసాయ రంగంలో మొదలైన రైతుల ఆత్మహత్యలు ‘ప్రపంచీకరణ’ విష ప్రభావానికి ఒక ఉదాహరణ మాత్రమే! ‘ఆత్మహత్యలు’ ఇతర రంగాలను సైతం ఆవహించడం నడుస్తున్న చరిత్ర! ఆత్మహత్యలతో రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు, ఆత్మహత్యల వల్ల వ్యవసాయేతర రంగాలలోని కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాబోవు. అయినప్పటికీ కార్మికులు, ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇదీ ‘ప్రపంచీకరణ’ భూతం విస్తరింపచేసిన మాయాజాలం! తెలంగాణ రాష్ట్ర ‘రోడ్డు రవాణా సంస్థ’- ఆర్‌టిసి-కి చెందిన ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనడానికి ఇదీ నేపథ్యం. విపత్తు విస్తరించిపోతుండడానికి ‘ప్రభుత్వ పారిశ్రామిక రంగం’ కారణం కాదు, ‘ప్రభుత్వేతర రంగం’ కారణం కాదు! విపత్తు విస్తరించిపోతుండడానికి కారణం ‘ప్రపంచీకరణ’! సార్వభౌమ దేశాల రాజ్యాంగ అధికార పరిధి కుంచించుకొని పోతోంది. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ అక్రమ లాభార్జన వాంఛా పరిధి వికృతంగా విస్తరించిపోతోంది! తెలంగాణ ‘ఆర్‌టిసి’ని ప్రభుత్వంలో విలీనం చేయాలా? ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తారా? ప్రభుత్వేతర రంగానికి ‘ఆర్‌టిసి’ని అప్పగిస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం మొత్తం దేశాన్ని ‘కరచి కరచి, తరచి తరచి దోపిడీ చేస్తున్న వాణిజ్య ప్రపంచీకరణ ప్రమాదం’లో ఒక అంశం మాత్రమే!! ‘ప్రపంచీకరణ’ గుదిబండను మన దేశం వదిలించుకుంటుందా? అన్నది సమగ్ర సమాధానం రావలసిన ప్రశ్న! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. రాజకీయ పక్షాల వారు, ఆర్థిక మేధావులు, ఉద్యమకారులు చెప్పాలి! ‘్ధ్యస’లేని ప్రజలు దోపిడీకి గురవుతున్నారు! ఇది అన్ని రంగాలకు చెందిన వైరీత్యం.. ‘్ధ్యస’లేని ప్రయాణీకులు నిరంతరం ‘బలిపశువులు’.. ఇది రవాణా రంగానికి చెందిన దౌర్భాగ్యం!!
ఒకప్పటి రవాణా అక్రమాలు ఇప్పుడు సక్రమమైపోతున్నాయి, ప్రభుత్వాలు నడుములను బిగించి సక్రమంగా మారుస్తున్నాయి. ఢిల్లీ, లక్నోల మధ్య గత వారం ‘ప్రభుత్వేతర సంస్థ’కు చెందిన రైలు సేవలు మొదలుకావడం ‘ప్రపంచీకరణ’ భయంకర బంధం మరింతగా బిగిసి పోతోందనడానికి సరికొత్త సాక్ష్యం. ఈ ‘ప్రభుత్వేతర’ శకటంలో ప్రయాణ శుల్కాలను చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారట. ప్రభుత్వరంగంలోని అత్యంత ఖరీదైన ‘రైళ్ల’లో వసూలుచేస్తున్న ‘శుల్కాల’కంటె ఈ కొత్త ‘రైలుఛార్జీలు’ ఎక్కువగా ఉన్నాయన్నది ప్రచారవౌతున్న వాస్తవం. ఇదంతా జనానికి-ప్రయాణీకులకు- ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటె హైదరాబాద్ తదితర నగరాలలో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థల ‘మైట్రో రైళ్ల’లో న్యాయమైన ‘శుల్కా’ల- ఛార్జెస్- కంటె రెండు రెట్లకు పైగా చెల్లించడానికి ప్రయాణీకులు అలవాటుపడిపోయారు. ఇలా తమ ‘గోళ్ల’ను ప్రభుత్వేతర సంస్థలు, బహుళ జాతీయ వాణిజ్యపు ‘దోపిడీ’ముఠాలు ఊడగొట్టడం గొప్ప ‘అనుభూతి’గా ఆనందపరవశులౌతున్న ‘మెట్రో’ ప్రయాణీకులు ‘నిలబడి’ ప్రయాణిస్తున్నారు. గతంలో ప్రభుత్వేతర సంస్థల వాహనాలలో ప్రయాణీకులను ‘నిలబెట్టి’ ప్రయాణింపచేయడం నేరం! అలా నిలబెట్టిన- ఓవర్ లోడింగ్- బస్సుల యాజమాన్యాలను ప్రభుత్వాలు శిక్షించేవి. ఈతరం ప్రయాణీకులకు అదంతా గుర్తులేదు, తెలీదు. అందువల్ల ‘మెట్రో’ రైళ్లలో, ఆర్‌టిసి బస్సులలో, ఆటోరిక్షాలలో ‘హాయిగా’ నిలబడి ప్రయాణం చేస్తున్నారు. ఏడుగురు కూర్చుని ప్రయాణించవలసిన పెద్ద ‘ఆటో’రిక్షాలలో పద్నాలుగురిని ‘కుక్కి’గమ్యం చేరుస్తున్నారు. ఎవ్వరూ అడగటం లేదు. ఇలా ‘ఇరుక్కొని’ ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ ‘సెవెన్ సీటర్’లలో ప్రయాణించడం నగర నరకాలలోని ప్రయాణీకులకు గొప్ప అనుభూతి!
లంచగొండి అధికార యంత్రాంగం, ‘వాటా’లను పొందుతున్న రాజకీయ యంత్రాంగం ఈ దుర్భర ప్రయాణాలకు కారణం. ఇలాంటి ఆటోరిక్షాలను నడుపుతున్నవారు ప్రయాణీకులను ‘‘ఈగల్లాగ దోమల్లాగ’’తోలుకొని పోతున్నారు, ప్రయాణీకులపై దౌర్జన్యకాండ చేస్తున్నారు. ఈ ‘దౌర్జన్యకాండ’ను జరపడం ‘ఆటోరిక్షా’ల నిర్వాహకులు బస్సు ‘కండెక్టర్’ల నుంచి, ‘డ్రయివర్ల’నుంచి నేర్చుకున్న పాఠం. పనికిమాలిన, ‘కార్లు గతిలేని’ నాసిరకం ప్రయాణీకులు మాత్రమే బస్సులెక్కుతున్నారన్నది ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర రంగ వాహన నిర్వాహకుల విశ్వాసం! ప్రభుత్వేతర రంగంలోని బస్సుల యజమానులలో అత్యధికులు ‘చట్టబద్ధత’ కలిగిన ‘గూండా’లన్నది జనానికి తెలిసిన రహస్యం. అందువల్లనే ‘ప్రైవేటు’ బస్సులను ఎక్కే ప్రయాణీకులు మరింతగా అణగిమణిగి ప్రయాణించాలి! ఈ ప్రభుత్వేతర ‘సంస్థ’ల ‘వోల్వో’ బస్సులు, ‘శయన యానాలు’ - స్లీపర్ కోచ్‌లు- సకాలంలో ‘నిర్దిష్ట’ ప్రాంతానికి రావు, బయలుదేరవు! బయలుదేరిన తరువాత భయంకర వేగంతో ఈ ‘ప్రైవేట్’బస్సులను నడుపుతున్నవారు ‘జాతీయ మహాపథాల’లో వాటిని బోల్తాకొట్టిస్తున్నారు. ‘అమిత వేగం అతి ప్రమాదం’ అన్నది ‘ఆర్‌టిసి’ బస్సులకు మాత్రమే వర్తిస్తోంది. ప్రభుత్వేతర సంస్థల బస్సులకు వర్తించడం లేదు.. అడిగేవారు లేరు!!
ఇలా అక్రమాలు ‘సక్రమాలు’గా మారిపోతుండడం ‘ప్రపంచీకరణ!’ ‘మా గీ’ సేమ్యాలలో విష రసాయనాలు కలిపి రుచిని- కృత్రిమ రుచి భ్రాంతిని- కల్పించి దోచుకుంటున్న ‘నెజల్’-నెస్లే- వంటి సంస్థలు అన్ని రంగాలలోను అక్రమాలు ‘సక్రమాలు’గా మారిపోతుండడానికి కొన్ని ప్రతీకలు మాత్రమే! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ నేర్పిస్తున్న ‘విలాసాలు’- ఫ్యాషన్స్- మన ధ్యాసను, దృష్టిని, బుద్ధిని, మనస్సును ఆవహించి ఉన్నాయి. ‘ప్రపంచీకరణ’కు పూర్వం ప్రభుత్వేతర సంస్థల యాజమాన్యాల వారు ప్రభుత్వ అధికార పరిధిని గుర్తించి గౌరవించేవారు. చట్టాలను ఉల్లంఘించడానికి భయపడేవా రు. ప్రభుత్వేతర రంగాల సేవలు ప్రభుత్వరంగ సంస్థల సేవలకంటె మెరుగ్గా ఉండేవి, శుల్కాలు తక్కువగా ఉండేవి! ‘ప్రపంచీకరణ’ విషపువేళ్లూనిన తరువాత మత్తెక్కించి ప్రభుత్వాలను నిర్దేశిస్తున్నాయి, నాసిరకం సేవలతో మాడుపగిలే ‘శుల్కాల’ను గుంజుకుని దోపిడీ చేస్తున్నాయి. ‘ఉబర్’, ‘ఓలా’సంస్థల వాహనాలు సంచార దోపిడీ వ్యవస్థలు’.. ‘్ధ్యస’ ఏదీ..?