మెయన్ ఫీచర్

మార్క్సిజాన్ని ముందే చెప్పిన మన వాల్మీకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్క్సిజానికి, అంబేద్కర్ ఆలోచనా ధోరణికి సామీప్యం వుందని ఇటీవల ఒక ప్రముఖ మాజీ ఐఎఎస్ అధికారి అన్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కావచ్చు. అలాగే- సాహిత్యానికి, మానవత్వానికి, మార్క్సిజానికి, రామాయణానికి, ఛాందసత్వానికి, కమ్యూనిజానికి, కర్మ సిద్ధాంతానికీ కూడా సామీప్యం వుందేమో అనిపిస్తుంటుంది. కార్ల్ మార్క్స్ కలలుగన్న సోషలిజం నిర్మాణం కోసం దశాబ్దాల క్రితం రష్యా ప్రయత్నించింది. ఇప్పుడు మార్క్స్ ద్విశత జయంత్యుత్సవాల ప్రారంభం నాటికి సోషలిజం కలగా కరిగిపోయింది. అయితే, మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలు, విశాల దృక్పథం ‘రామాయణం’ రచించిన వాల్మీకిలోనూ మనం చూడొచ్చు.
మానవ విలువలకు మారుపేరైన బుద్ధుడు, ఆరునూరైనా అసత్యమాడని యుధిష్ఠిరుడు, స్వధర్మ నిర్వహణే తన విధి అని తలచిన శ్రీరాముడు, కర్తవ్యబోధ చేసిన శ్రీకృష్ణుడు, అహింసే తన మతమన్న గాంధీజీ, శ్రామిక-కార్మిక-కర్షక ఆధిపత్యాన్ని కోరిన కార్ల్ మార్క్స్ బహుశా ఒకే కోవకు చెందినవారేమో! హిందూత్వం అనేది మతం అయినా కాకపోయినా, మనిషి జీవించడానికి ఓ ఆదర్శమైన ‘జీవన విధానం’ అనేది నూటికి నూరుపాళ్లు నిజం. ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి, యావత్తు సమాజాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తుందనేది నిర్వివాదాంశం. అలాగే, ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దం పట్టిన అతి గొప్ప సిద్ధాంతం ‘మార్క్సిజం-కమ్యూనిజం’.
హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం- ఈ సకల చరాచర ప్రపంచమంతటికీ, భూతకాలంలో జరిగిన దానికీ- వర్తమానంలో జరుగుతున్న దానికీ- భవిష్యత్‌లో జరగబోయేదానికీ, కర్త కర్మ క్రియ ఒక్కడే. ఏ పనిని ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో, లాభనష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుంది. సృష్టించేది బ్రహ్మ అనీ, సంహరించేది రుద్రుడు అనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తి అనీ అనుకుంటాం. బహుశా అది నిజం కాదేమో! అనంత కోటి బ్రహ్మాండానికి ‘పరబ్రహ్మం’ ఒక్కరే అయి ఉండాలి. ఆ ఒక్కరికి సమానులు గానీ, అధికులు కానీ ఎవరూ వుండదు. గడ్డిపోచ కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. ఆ ఒక్కరే సృష్టికొక అధికారిని (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారిని (రుద్రుడు) నియమించాడు. బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే. అంటే ఎవరో ఒక ‘జగన్నాటక సూత్రధారి’ స్వయంగా రచించి నిర్మించి దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అద్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ నిర్జీవ రాశులన్నీ తమ వంతు పాత్ర పోషించాయి. ఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తే, దాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి- ఆగమన్నప్పుడు ఆగి, జీవితం చాలించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే వదిలేయాలి.
నిశితంగా పరిశీలిస్తే- కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే కనిపిస్తాయి. ఆయన కలలుకన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వరంగంలో ‘నిరంకుశ భూస్వామ్య-్ధనస్వామ్య వ్యవస్థ’కు వ్యతిరేకంగా శ్రామిక వర్గం పోరాడుతుందని, దరిమి లా విజయం సాధిస్తుందని- ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామిక వర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల - మత- వర్గ- పేద - ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగిన దానిని (్భతకాలం) విశే్లషించి, జరుగుతున్నదానిని (వర్తమాన కాలం) వ్యతిరేకించి, జరగాల్సిన దాన్ని (్భవిష్యత్) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతి తార్కిక భౌతికవాదాన్ని ‘యాంటీ థీసిస్, థీసిస్, సింథసిస్’ అని పిలిచాడు. దీన్ని ఒక రకమైన ‘కర్త, కర్మ, క్రియ’ అనొచ్చేమో. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్. వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్థారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక- కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో, వుండబోతాయో నిర్ణయించాడు. ఆరంభం, అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగింది కూడా. కాకపోతే అసలు సిసలైన ‘జగన్నాటక సూత్రధారి’ నిర్ణయానికి లోబడే అవన్నీ జరిగుండాలి.
ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పుచెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్టు సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశదపర్చాలన్న ఆతృత, ఆందోళన మార్క్స్ రచనల్లో దర్శనమిస్తుంది. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక- సహకార ఉత్పత్తి- పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ- సామాజిక ఉ ద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా ఉండే ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ పేర్కొంటాడు.
మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో ఆమాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు- యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్విక- సామాజిక వర్గమే ఆయన ప్రవచించిన మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక- ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవితలక్ష్యం, గమనం వారి వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధాపడి వుంటాయి. మానవుడు తను బతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరితో- ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక- రాజకీయ సంస్థలకు- వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గ పోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ- లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి - దశకు చరిత్ర పయనించి, సంశే్లషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఈవిధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్ళను- సం ఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజావ్యతిరేక వ్యవస్థను కూలదోసి, శ్రామిక రాజ్యస్థాపన ద్వారా వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తుంది.
మార్క్స్ ప్రవచనాలకు, తదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా- చైనా విప్లవానికి, శ్రామిక రాజ్యస్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమే- వాల్మీకి సంస్కృతంలో రామాయణం రచించాడు. వాల్మీకి రచన బ్రహ్మ పేరణతోనే జరిగింది. అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదా! రామాయణంలోని పాత్రలను- చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకి. శ్రీరాముడిని దైవంగా, మహావిష్ణువు అంశగా, జరగబోయేదాన్ని వివరంగా- రామాయణ గాధగా లోకానికి తెలియచెప్పాడు. రాముడు త్రేతాయుగంలో జన్మించి, దుష్టశిక్షణ- శిష్టరక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియజేసేదే రామాయణ కథ. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా, భక్తుడిగా, కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవానుగ్రహానికి గురై, శ్రీరాముడికి శత్రువుగా- రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాశాడు వాల్మీకి. మార్క్స్ గతి తార్కిక- నిర్థారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినా, రష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్, మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రులే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తి, చైనా చాంగ్ - షెక్‌లు రావణాసురుడిలాంటి రాక్షసులు. మార్క్స్ పరిభాషలోని నిరంకుశ భూస్వామ్య - ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహాబలవంతుడు- రాక్షస రాజు రావణాసురుడు. ‘శ్రామిక వర్గం’ లాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమి పాలయ్యా డు. ఆ కూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న శ్రీరామచంద్రుడు. ఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడు, ఆచార్య లక్షణాలున్న హనుమంతుడు. మార్క్ పరిభాషలో చెప్పుకోవాలంటే: మావో, లెనిన్, చౌన్ ఎన్ లై, స్టాలిన్ కోవకు చెందినవారు. మార్క్స్ చెప్పిన ‘యాంటీ థీసిస్, థీసిస్, సింథసిస్’ రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చు. మార్క్స్ కోరుకున్న ‘శ్రామిక - కార్మిక- కర్షక’ రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన ‘రామరాజ్యం’. కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవ్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడు. వాల్మీకైనా, మార్క్సైనా వారి వారి సాహిత్యాలలో దేశ కాల పరిస్థితులకనుకూలమైన మానవ విలువల పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారు.
మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం అనే్వషణ జరుగుతుందనడానికి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. కథానాయకుడు సాక్షాత్తూ మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో ఆయన అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడడానేది సారాంశం. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండకపోతే, మనలాంటివారు అంధకారంలో పడి, దురాచార పరులమైపోయి, మానవ విలువలకు తిలోదకాలిచ్చేవారిమేమో! శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య దురంధరత్వం విశ్వామిత్రుడి యాగ సంరక్షణతో, రాక్షస వధతో ప్రారంభం అవుతుంది. మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను- సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరని చెప్పుకున్నాం. ఇలాంటిదే ఇది. శ్రీరాముడలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వాల్మీకి విశ్వామిత్రుడితో చెప్పిస్తాడు. వాల్మీకి రామాయణంలోని ‘వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం’, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు, ‘ఆత్మవిద్యకు, అనాత్మ విద్యకు’ మధ్య జరిగిన యుద్ధం. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. వర్గపోరాటంలో కూడా కార్మిక వర్గ నియంతృత్వానికి పూర్వరంగంలో, తమ హక్కుల కోసం శ్రామికులు పోరాడుతారని మార్క్స్ అంటాడు. ‘సంకెళ్లు తప్ప కార్మికులు కోల్పోయేదేమీ లేదు’ అంటాడు మార్క్స్. దీనర్థం- ఎదుటివారిని దెబ్బతీసేందుకన్నా, తమను తాము రక్షించుకోవడమే ప్రధానమని. ఇదీ మానవ విలువలనే సూచిస్తుంది.

- వనం జ్వాలా నరసింహారావు సెల్ : 80081 37012*