Others

ఆ చూపు.. బాలీవుడ్ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ ట్రేండింగ్ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజమనే తెలుస్తోంది. ఎందుకంటే ఆయనతో ఏకంగా త్రి భాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు. తెలుగులో ఉన్న టాప్ బ్యానర్స్‌లో మైత్రీ మూవీమేకర్స్ ఒకటి. రీసెంట్‌గా విడుదలైన ‘సవ్యసాచి’ ఒక్కటి పక్కనబెడితే మైత్రీ ట్రాక్ రికార్డు సాధారణమైంది కాదు. ఇక మైత్రీ మూవీస్ ప్రస్తుతం 10 ప్రాజెక్టులపై పని చేస్తోంది. అందులో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని వివిధ ప్రొడక్షన్ స్టేజిల్లో ఉన్నాయి. కొన్ని ప్లానింగ్ దశలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మైత్రీ మూవీస్ విజయ్ దేవరకొండతో ఒక త్రిభాషా చిత్రం ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం ఒక లీడింగ్ బాలీవుడ్ డైరెక్టర్‌ను లాక్ చేశారట. తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లో ఒకేసారి సినిమాను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఈ సినిమాతో మైత్రీ మూవీస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టే. ఇప్పటికే టాలీవుడ్‌లో సత్తాచాటిన మైత్రీ తమిళ, హిందీ మార్కెట్లపైనా ఫోకస్ చేయడం విశేషం. ఈ సినిమాకాకుండా మైత్రీ మూవీస్ విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.