తూర్పుగోదావరి

14వ ఆర్థిక సంఘ నిధుల సాధన లక్ష్యంగా...జిల్లా ఎంపిపిల సమాఖ్య ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఆగస్టు 26: మండల ప్రజాపరిషత్‌లకు 14వ ఆర్ధిక సంఘం నిధుల సాధనే లక్ష్యంగా జిల్లా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల సమాఖ్య ఆవిర్భవించింది. కాకినాడలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఎంఎల్‌సి రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ సంఘం ఆవిర్భవించింది. సమావేశానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, ఎంఎల్‌సి బొడ్డు భాస్కరరామారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా 14వ ఆర్ధిక సంఘం నిధులపై చర్చించారు. సమావేశంలో అంబాజీపేట మండల అధ్యక్షులు దాసరి వీరవెంకటసత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్ధిక సంఘం నిధులను మండల ప్రజాపరిషత్‌లకు, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఇవ్వకపోవడంతో నిధులులేమితో ఎంపిపిలు, ఎంపిటిసి, జడ్పీటిసి సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి 14వ ఆర్ధిక సంఘం నిధులను మండలాలకు, జిల్లా పరిషత్‌లకు విడుదలచేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈవిషయాలను జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, ఎంఎల్‌సిలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలన్నారు.
ఈసందర్భంగా జిల్లా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల సమాఖ్య సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల రామారెడ్డి ఎన్నికల పరిశీలకునిగా హాజరై ఎన్నికలను నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షునిగా కాజులూరు ఎంపిపి యాళ్ళ కృష్ణారావు, అధ్యక్షునిగా అంబాజీపేట ఎంపిపి దాసరి వీరవెంకటసత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా రావులపాలెం ఎంపిపి కోట చల్లయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రౌతులపూడి ఎంపిపి ఇటంశెట్టి సూర్యభాస్కరరావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా యుకొత్తపల్లి ఎంపిపి పి సత్యవతి, సామర్లకోట ఎంపిపి జి మోర్త, కపిలేశ్వరపురం ఎంపిపి కాదా వెంకటరాంబాబు, కడియం ఎంపిపి మార్గాని లక్ష్మి, రాజవొమ్మంగి ఎంపిపి కలింగకోట నూకరత్నం ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా రాజానగరం ఎంపిపి బచ్చు శ్యామల, ఉప్పలగుప్తం ఎంపిపి శిరంగు సత్తిరాజు, తొండంగి ఎంపిపి చిట్టుమూరి సంధ్య, సహాయ కార్యదర్శులుగా గోకవరం ఎంపిపి ఈది రత్నజ్యోతి, గండేపల్లి ఎంపిపి దారా సుశీల ఎన్నికయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎంపిపిల ఆసోసిషేయన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పెదపూడి ఎంపిపి జిత్తుక స్యూరకుమారి ఎన్నికయ్యారని నూతన అధ్యక్షులు వెంకటసత్యనారాయణ తెలియజేశారు.