తూర్పుగోదావరి

సూదాపాలెం బాధితులకు కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 4 : ఇటీవల సూదాపాలెం దాడిలో గాయపడిన బాధిత కుటుంబాలను మాజీ ఎంపి జెడి శీలం ఆదివారం పరామర్శించారు. పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజుతో కలిసి ఆయన జానకి పేటలోని బాధిత కుటుంబాల ఇంటికివెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందించడంలో టిడిపి, బిజెపిలు ద్వంధ్వ వైఖరి అవలంభిస్తూ ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు. ఫ్యాకేజీ వల్ల అధికారపార్టీ నాయకులకే లాభం తప్ప, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని జెడి శీలం స్పష్టం చేసారు. ఆయన వెంట ముషిని రామకృష్ణారావు, అయితాబత్తుల సుభాషిని, అడపా వీరమాచరరావు, జె సుబ్రహ్మణ్యం, కుడుపూడి శ్రీను, గెడ్డం సురేష్‌బాబు, పండు సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.