తూర్పుగోదావరి

త్వరలో ఎడిబిరోడ్డు విస్తరణ పనులు ప్రారంభం:ఆర్డీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగంపేట, సెప్టెంబర్ 8: రాజానగరం నుండి సామర్లకోట వరకూ 4 లైన్ల రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభంకానున్నట్లుగా పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావు తెలిపారు. గురువారం రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి మండలంలో రంగంపేట ,చండ్రేడు-పెదరాయవరం ఎడిబి రోడ్డును పరిశీలించారు. వైజాగ్-చెన్నై కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్డు పనులును చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. చెరువులు, మలుపులు వద్ద తిరిగి కొలతలు వేయాల్సి వుందన్నారు. రోడ్డు పనులకు గ్రామస్థులు సహయ సహకారాలందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్‌ఇఇ జాన్ సుధాకర్, డిఇ వై రవీంద్ర, ఎఇఇడి ఎ వర్మ, తహసీల్దార్ రామారావు, సర్వేయర్ పివి రమణ, రంగంపేట, పెదరాయవరం సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.