తూర్పుగోదావరి

నిత్య విద్యార్థికి 24వ డిగ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 9: నిత్య విద్యార్థి, ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి ఖాతాలో మరో పిజి డిగ్రీ నమోదైంది. ఆయన ఇప్పటి వరకు మొత్తం 24 డిగ్రీలు సాధించడం విశేషం. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవిద్యలో ఇప్పటి వరకు 4 ఎల్‌ఎల్‌ఎం పట్టాలను సాధించానన్నారు. తాజాగా కార్పొరేట్, సెక్యూరిటీ న్యాయ విద్యలో 5వ పిజి పట్టాను సాధించినట్లు తెలిపారు. 67శాతం మార్కులతో ప్రథమశ్రేణిలో పరీక్షలో ఉత్తీర్ణత సాధించానన్నారు. ఎండి సైకియాట్రీ, న్యాయవిద్య, మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, జర్నలిజం, సైకోథెరపి, లైబ్రరీ సైన్స్ విద్యల్లో మొత్తం 24 డిగ్రీలు, పిజిలు పొందినట్లు వివరించారు. ఎంఏ సోషల్ వర్క్‌ను పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో పాల్గొన్న జిఎస్‌ఎం న్యాయకళాశాల ప్రిన్సిపాల్ మధుసూదనరావు మాట్లాడుతూ ఇన్ని డిగ్రీలు సాధించిన రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించాలన్నారు. కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్, భారత్‌వికాస్‌పరిషత్ నాయకులు ఫణినాగేశ్వరరావు, పివిఎస్ కృష్ణారావు ఈసమావేశంలో పాల్గొన్నారు.