తూర్పుగోదావరి

‘పెద్ద’ జిల్లాపై చిన్న చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 2: నవ్యాంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద జిల్లాగా అవతరించి, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తూర్పు గోదావరి జిల్లాపై చిన్నచూపు చూశారంటూ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మంత్రివర్గ తాజా కూర్పుపై జిల్లాకు చెందిన ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇంకోవైపు పార్టీ శ్రేణులు కూడా విస్తరణపై అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. ఫలానా నేతకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదన్న అంశాన్ని పక్కన పెడితే జిల్లాలో విధిగా మరొకరికి కేబినేట్‌లో చోటు కల్పించాల్సి ఉందని, అయినప్పటికీ ఆ ఊసే ఎత్తలేదంటూ అధినేత చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుండి ప్రస్తుతం బిసి సామాజికవర్గం నుండి యనమల రామకృష్ణుడు, కాపు సామాజికవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో చినరాజప్ప పెద్దాపురం ఎమ్మెల్యే కాగా, రామకృష్ణుడు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి పొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశానికి అనూహ్యమైన విజయం లభించింది. ఆ ఎన్నికల్లో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ స్థానాలు సహా మెజారిటీ అసెంబ్లీ సీట్లు తెదేపా వశమయ్యాయి. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు గాను కొత్తపేట, రంపచోడవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్ధులు విజయం సాధించారు. టిడిపి రెబల్‌గా పిఠాపురం నుండి పోటీ చేసిన ఎస్‌విఎస్‌ఎస్ వర్మ విజయం సాధించి, తిరిగి తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో అప్పట్లో టిడిపి అభ్యర్ధుల సంఖ్య 14కు చేరింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 16కు చేరింది. అధికార పార్టీకి ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలున్న జిల్లా రాష్ట్రంలో మరొకటి లేదనే చెప్పాలి! ఇదిలావుంటే గత కాంగ్రెస్ హయాంలో జిల్లా నుండి ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించారు. కాపు, శెట్టిబలిజ, దళిత సామాజికవర్గాల నుండి ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే (చినరాజప్ప) మంత్రి పదవిలో ఉన్నారు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే కేబినేట్‌లో చోటు దక్కకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి పదవికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజీనామా చేయడం దేశం వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలుగుదేశం హయాంలో గతంలో కమ్మ సామాజికవర్గం నుండి గోరంట్ల మంత్రిగా పనిచేశారు. ఆ సంప్రదాయాన్ని చంద్రబాబు తిరిగి నెలకొల్పుతారని ఆశించిన గోరంట్ల తుదకు భంగపాటుకు గురయ్యారు. దీంతో చంద్రబాబు తీరును నిరసిస్తూ పార్టీని ఎక్కడకు తీసుకువెళ్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి లభిస్తుందన్న ఏకైక కారణంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన జ్యోతుల నెహ్రూకు విస్తరణలో చుక్కెదురయ్యింది. తనతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరిన వేర్వేరు జిల్లాలకు చెందిన నలుగురికి కేబినేట్‌లో చోటు కల్పించి, తనకు మాత్రం అన్యాయం చేశారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదంటూ తన సన్నిహితుల వద్ద జ్యోతుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి కూడా మంత్రి పదవులను ఆశించి భంగపడ్డారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎస్ వర్మ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితరులు మంత్రి పదవులను ఆశించిన వారిలో ఉన్నారు.