తూర్పుగోదావరి
వైభవంగా జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
ఆత్రేయపురం, ఏప్రిల్ 15: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. కల్యాణబ్రహ్మ శ్రీనివాసులు వెంకటాచార్యులు బ్రహ్మత్వంలో అర్చకులు వాడపల్లి రంగాచార్యులు, వాడపల్లి భాస్కరాచార్యులు, ఖండవల్లి శోభనాద్రాచార్యులు, టివి ఫణికుమార్ శర్మ అవధాని కల్యాణం నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ పెనుమత్స సత్యనారాయణరాజు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు గరుడవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ఆలయ ఇఒ యర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.