తూర్పుగోదావరి

పర్యటనలు కాదు.. ప్రాజెక్టులు పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 17: పోలవరం పర్యటనలవల్ల ఎటువంటి ఉపయోగం లేదని, ఆ ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి ద్వారా ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు సూచించారు. అంతే కానీ పర్యటన చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో మధు విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలు శాసనసభలో చర్చలు జరపకుండా పర్యటన బాట పట్టారన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని పూర్తి చేయాలన్నారు. పోలవరం సమస్య తీరాలంటే ముఖ్యంగా ముంపు బాధితుల సమస్యలను తీర్చాలని, ఇప్పటికే 14 గ్రామాలను తొలగించారన్నారు. టిడిపి ప్రభుత్వం తమ స్వప్రయోజనాకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందన్నారు. విభజన చట్టంలోని హామీలను డిమాండ్ చేయడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరోపక్క రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా విశాఖలో రైతు సమ్మిట్‌లను ఏర్పాటుచేసి చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. 3600 కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేయకుండా సమ్మిట్‌లు నిర్వహించడం రైతులను అవమానపరచమేనన్నారు. విభజన హామీల్లోని చట్టాలను అమలు చేయాలని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ నెల 20న వామపక్ష, ప్రజా సంఘాలతో కలిసి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మధు చెప్పారు. సుమారు ఐదేళ్ల క్రితం కాకినాడ సెజ్‌లోని భూముల్లో ఏరువాక సాగించి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను రైతులకే తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వారిని జైళ్లల్లో పెట్టిస్తున్నారన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతిస్తే ఊరుకొనేదిలేదని మధు హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, దడాల సుబ్బారావు, జి బేబీరాణి తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థ నాశనానికి ప్రయత్నిస్తే ఇంటికే...
రామచంద్రపురం, నవంబర్ 17: రెవెన్యూ వ్యవస్థ కన్నా ఎవరూ ఎక్కువ కాదు.. ఆ వ్యవస్థను నాశనం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. ఎంతటి హోదా కలిగిన వారైనా ఇంటికి వెళ్లాల్సిందేనని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున హెచ్చరించారు. భూసేకరణల అంశంపై మండలాల వారీగా రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆర్డీవో ఎన్ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన డివిజనల్ రెవిన్యూ అధికారుల సమావేశానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తహసీల్దార్లు భూసేకరణకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన వివరాలను అందించకపోవడంతో ఆయన వారిపై ప్రశ్నలు సంధించారు. గతంలో ఇళ్లపట్టాల పంపిణీ జరిగినా గృహ నిర్మాణాలు చేపట్టలేదని, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తే.. ఖాళీ స్థలాలనేవి ఉండవన్నారు. భూసేకరణ చేసేటప్పుడు గృహ నిర్మాణాలకు అనువుగా ఉండే స్థలాలను సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. 2007లో వ్యవసాయ భూములను ఇళ్లస్థలాలుగా సేకరించడం ప్రస్తుతం అందరినీ ఇబ్బందికి గురిచేస్తోందన్నారు. జిల్లా అంతా ఇదే సమస్య ఉందన్నారు. సక్రమ లబ్ధిదారులను గుర్తించాలని, వ్యాపారానికి వినియోగించే లబ్ధిదారుల జాబితాను పక్కన పెట్టాలన్నారు. బిక్కవోలు మండలంలో ఒక సామాజిక వర్గీయులకు ఒకే ప్రదేశంలో ఇళ్లు కేటాయించడం పొరపాటని జేసీ మల్లికార్జున స్పష్టంచేశారు. లాటరీ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు సక్రమ రీతిలో కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అభ్యంతరకర భూములు కాకుండా, మిగిలిన భూముల్లో 500 చదరపు గజాల స్థలాన్ని గృహ అవసరాలకు ఎవరైనా ఆక్రమిస్తే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 ఏళ్ల పాటు నివాసం ఉండేవారికి ప్రభుత్వ చలానా ద్వారా సొమ్ము చెల్లింపు చేసి, రెగ్యులరైజేషన్ చేపట్టాలన్నారు. 380 జీవోపై అవగాహన ఎంతమందికి ఉందని వీఆర్వోలను ఆయన ప్రశ్నించగా, ఒక్కరు మాత్రమే అవగాహన ఉందని తెలిపారు. దీంతో జేసీ మల్లికార్జున జీవోలకు సంబంధించి కింది స్థాయి వరకు అవగాహన కల్పించాలని, విషయ పరిజ్ఞానం వీఆర్వోలకు తెలిస్తే.. ప్రజలకు వారు వివరిస్తారని స్పష్టంచేశారు. అర్హత కలిగిన భూమిలో అర్హత కలిగిన వ్యక్తులకే చెందేలా చూడాలన్నారు. ఆర్వోఆర్ కేసులకు సంబంధించి ట్రాకింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయాలని, క్షేత్ర పరిశీలన చేసి, నివేదికలు పంపాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి కింది కోర్టులు ఏవైనా తీర్పులు వెలువరిస్తే.. వెంటనే సంబంధిత తహసీల్దార్ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. రామచంద్రపురం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 11 సెంట్లు మాత్రమే ఉందని డిప్యూటీ తహసీల్దార్ వైద్యనాథ శర్మ చెప్పగా, ప్రజలకు భూములను పంచే రెవిన్యూ శాఖకు భూమిలేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. డివిజన్ పరిధిలోని తహసీల్దార్లతోపాటు ఆర్డీవో కార్యాలయ ఏవో పెండ్యాల రామమూర్తి, వీఆర్వోలు పాల్గొన్నారు.