తూర్పుగోదావరి

అమలాపురం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముమ్మిడివరం, నవంబర్ 19: అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కాశి బాలమునికుమారి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారు జామున ముమ్మిడివరంలోని పుట్టింటిలో పురుగుల మందు సేవిండంతో దానిని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇటీవల ఆమెను వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. అయితే ఆ నియామకాన్ని వ్యతిరేకిస్తూ, ఆమెను కించపరుస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునికుమారిని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, శెట్టిబత్తుల రాజబాబు, పెయ్యిల చిట్టిబాబు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, మిండగుదిటి మోహన్, బొంతు బుజ్జిబాబు, మల్లాడి భైరవమూర్తి, నల్లా నరసింహమూర్తి, అడ్డగళ్ళ సాయిరాం, జనిపల్లి అయ్యప్ప, స్థానిక నాయకులు పరామర్శించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి ప్రభాకరరావు తెలిపారు.