తూర్పుగోదావరి

పలు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 20: ఆసియాలోనే అతిపెద్ద ప్లాట్‌ఫారం కలిగిన ఖరగ్‌పూర్‌లో మరమ్మతులు నిర్వహిస్తున్నందున సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సంత్రాగచ్చి-మంగుళూరు, హౌరా- కన్యాకుమారి, హౌరా-చెన్నై, హౌరా-హైదరాబాద్ మధ్య తిరిగే రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పేపరుమిల్లు కాలుష్యం నుండి కాపాడండి...!
మండపేట, నవంబర్ 20: మండలంలోని మారేడుబాక గ్రామంలోని శ్రీనివాస కాలనీవాసులు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని పేపరు మిల్లు నుండి వచ్చే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందారు. ప్రతి ఏడాది అక్టోబరు నుండి జనవరి వరకు వీచే తూర్పు గాలులతో పేపరుమిల్లు నుండి వచ్చే నల్లబూడిద ఇళ్లల్లోకి వస్తోందని, దీంతో గృహోపకరణాలతో పాటు ఆహార వస్తువులు కలుషితమవుతున్నాయన్నారు. ఈ కారణంగా కంటి సమస్యలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నామన్నారు. ఇదే ప్రాంత సమీపంలో కళాశాలలున్నాయని, ఈ కారణంగా విద్యార్థులు కూడ ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమంలో తహసీల్దారు ఎన్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు.