తూర్పుగోదావరి

డిజిటల్ ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 28: ప్రజలకు ప్రభుత్వ సేవలను డిజిటల్ ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో శనివారం కామన్ సర్వీస్ సెంటర్ 2.0 (మీసేవ) ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటుచేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి జెసి మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్, స్మార్ట్‌వార్డ్ ఏర్పాటులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ సెంటర్ ద్వారా అన్ని ప్రభుత్వ సర్వీసులను అందించనున్నట్టు తెలిపారు. అన్ని శాఖల ప్రభుత్వ సేవలను మీసేవ ద్వారా పొందవచ్చని, ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు వివిధ రకాల సేవలందించడం ఈ కామన్ సర్వీస్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో రైతుల వివరాలను పూర్తిగా నమోదు చేశామని, వారు ఎక్కడినుండైనా ఆన్‌లైన్ విధానంలో తమ భూమి వివరాలను పరిశీలించుకోవచ్చన్నారు. మీసేవ సెంటర్‌ను ప్రజలకు అనుకూలమైన వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ అధికారి శ్రీహర్ష, టెక్నికల్ టీమ్ లీడర్ ఎం కుమార్, ఈ-గవర్నెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ జెసితో సమస్యలు పరిష్కారం
కాకినాడ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన డయల్ యువర్ జెసిలో సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 ఫోన్‌కాల్స్ రాగా జెసి వాటిని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయల్ యువర్ జెసికి అందిన ప్రతి అర్జీని అత్యంత జాగ్రత్తగా స్టడీచేసి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అందే ప్రతి ఒక్క అర్జీకి సకాలంలో న్యాయం జరుగుతున్న భావన ప్రజల్లో కలిగేవిధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి యాదగిరి, డిఎస్‌ఒ ఉమామహేశ్వరరావు, వివిధ శాఖల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు
ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
రాజమండ్రి, నవంబర్ 28: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందగా, బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ఈసంఘటన శనివారం తెల్లవారుజామున దివాన్‌చెరువు సమీపంలో 4వ వంతెనపై జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం విశాఖపట్నం నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ కావడంతో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సు ముందు వరుసలో కూర్చున్న తిరుపతికి చెందిన ఎస్‌విఎస్ శ్రీరామ ఆదిత్య(20), చిలకలూరిపేటకు చెందిన కె శ్రీనివాస్, కె సాంబశివరావుతో పాటు డ్రైవర్, క్లీనర్‌లు గాయపడ్డారు. వారిని హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆదిత్య మృతి చెందాడు. ఆదిత్య విశాఖపట్నంలోని గీతం కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదిత్య తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఆసుపత్రి వాతావరణం హృదయవిదారకంగా కనిపించింది.
అర్బన్ పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు
ఏలూరు రేంజి డిఐజి హరికుమార్
పెద్దాపురం, నవంబర్ 28: పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు ఉన్నందున ఈ ప్రాంతాల్లో అర్బన్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజి డిఐజి హరికుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన స్థానిక డిఎస్పీ కార్యాలయం, పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏలూరు రేంజీ పరిధిలో 600 కానిస్టేబుళ్లు, 80 ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇటీవల ప్రభుత్వం పోలీసు నియామకాలకు అనుమతులు మంజూరు చేసిందని, త్వరలోనే నియామకాలకు చర్యలు తీసుకుంటామన్నారు. విలీన మండలాల్లో సిబ్బంది సర్దుబాటు వల్ల జిల్లాలో పోలీసుల కొరత ఉందన్నారు. అనాధిగా డిఎస్పీ కార్యాలయం అద్దె భవనంలో నిర్వహించడం విస్మయం కలిగించిందన్నారు. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో నాలుగు పోలీసుస్టేషన్లకు గాను మూడు స్టేషన్లు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, త్వరలోనే శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షించడంలో పోలీసులు మరింత శ్రద్ధ కనబరచాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ రాజశేఖర్‌రావు, ఎస్సైలు సతీష్, మురళీకృష్ణ, సిఐ శ్రీ్ధర్‌కుమార్, అడిషనల్ ఎస్సై ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.