తూర్పుగోదావరి
ఎలుగుబంటి దాడిలో గిరిజనునికి తీవ్ర గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 April 2018
మారేడుమిల్లి, ఏప్రిల్ 25: ఎలుగుబంటి దాడిలో ఒక గిరిజనుడు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం ధారవాడ గ్రామానికి చెందిన పల్లాల సోమిరెడ్డి అతని పోలంలో జీడిపిక్కలు సేకరించడానికి వెళ్ళగా అక్కడ ఉన్న రెండు పిల్లలు గల ఎలుగుబంటి దాడి చేసి సోమిరెడ్డిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో ఇతడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో చుట్టుపక్కల గిరిజనులు బిగ్గరగా కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. అతనిని వెంటనే 108లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సోమిరెడ్డి పరిస్థితి మరింత విషమించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.