తూర్పుగోదావరి

హోదా సాధనకు కలిసి పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, ఏప్రిల్ 26: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమయ్యిందని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం మండలంలోని ఆనూరు గ్రామంలో హోదా ఉద్యమ సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్న చినరాజప్ప మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. మిత్ర ధర్మం కొద్ది నాలుగేళ్లు కలిసి ఉన్నామని, హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. సైకిల్ యాత్రను విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఆనూరు, కొండపల్లి గ్రామాల్లో ఆయన సైకిల్ యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సింగన అరవింద్, నల్లల గంగాలక్ష్మి, ఎలిశెట్టి నాని, కొత్తిం కోటి, కొడ్రు పార్ధుడు, కలకపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.