తూర్పుగోదావరి

టిడిపి పాలనలోనే అభివృద్ధి;జడ్పీ ఛైర్మన్ నామన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అన్నారు. గురువారం ఐ పోలవరం మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. జి వేమవరం గ్రామంలో జడ్పీ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు సర్వశిక్షాభియన్ నిధులు రూ. 5.80 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదిని, అలాగే గుత్తెనదీవి గ్రామంలో సర్వశిక్షాభియన్ నిధుల నుండి రూ. 5 లక్షలతో నిర్మించిన తరగతి గదిని, ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. కేశనకుర్రు గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, జడ్పీటిసి పి రాజశేఖర్, ఎంపిపి ఇందుకూరి పద్మ, కేశవరామరాజు, సర్పంచ్‌లు, నీటిసంఘం అధ్యక్షుడు డిసి సూరిబాబురాజు, ఎంపిటిసిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.