తూర్పుగోదావరి

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మే 2:వారంతా చిరుద్యోగులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ తొమ్మిదేళ్లుగా కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై నిఘా పెట్టి 75శాతం పనిదినాలు పూర్తిచేసిన వారిని మాత్రమే విధుల్లో ఉంచాలని, మిగిలిన వారిని తొలగించాలని జీవో జారీ చేసారు. ఆ మేరకు జిల్లాలో సుమారు 394 ఫీల్ఢ్ అసిస్టెంట్లకు 75 శాతం పనిదినాలు లేవన్న కారణంతో వారిని విధుల నుండి తొలగించారు. అనంతరం వారంతా కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆదేశాలమేరకు ఆర్డీవో, ఎంపిడిఒ, ఇడి ఎస్సీ కార్పొరేషన్‌తో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్లను స్వయంగా విచారించి ఏకారణం చేత 75 శాతం పని దినాలు కల్పించలేకపోయారో తెలుసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీంతో అయా ఎమ్మెల్యేల సిపార్సుల మేరకు జిల్లాలోని 18 నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఒక్క ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన 37 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వారంతా స్థానికంగా ఉన్న నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, తమ ఉద్యోగాలు తమకు ఇప్పిస్తే బుద్ధిగా ఉంటామని వేడుకుంటున్నా వారి మనస్సు కరగడంలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు వౌఖిక ఆదేశాలు లేనిదే తామేమీ చేయలేమని అధికారులు చెపుతున్నట్లు సమాచారం. ఇంతకీ ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన ఫీల్డ్ అసిసెంట్లు చేసిన పాపం ఏమిటంటే కొంత మంది ఫీల్డ్ అసిసెంట్లు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పనిచేసారన్నది తెలుగుతమ్ముళ్ల అంతర్గత ఆరోపణ. ఇదే విషయాన్ని గతంలో జరిగిన నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లో మండల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఫీల్ఢ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుని తమను ఎందుకు తీసుకోవడంలేదని ముమ్మిడివరంకు నియోజకవర్గంకు చెందిన పలువురు ఫీల్డ్ అసిసెంట్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నామని, అర్థాంతరంగా తమను విధుల నుండి తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమికావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబాలతో ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఫీల్ఢ్ అసిస్టెంట్లు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అమలాపురం క్లష్టర్ ఎపిడి సోమేశ్వరరావును వివరణ కోరగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం మండలాల్లోని 26 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు 75 శాతం పనిదినాలను పూర్తి చేయని కారణంగా వారిని విధుల నుండి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. తాళ్లరేవు మండలంలో 11 మంది కాకినాడ డివిజన్ పరిధిలోకి వస్తారని, ఆమండలానికి సంబందించిన సమాచారం తన వద్ధలేదన్నారు.