తూర్పుగోదావరి

నియోజకవర్గానికో ‘్భఫోర్స్’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 15: అధికార తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో బోఫోర్స్ తరహా కుంభకోణాలు చోటుచేసుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. యథారాజ తథా ప్రజ అన్న తరహాలో ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యేల వరకు అవినీతిలో మునిగిపోయారన్నారు. రాజానగరంలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్ ప్రసంగించారు. భీకర స్వరంతో ప్రసంగం ఆద్యంతం ప్రభుత్వంపై తీవ్రస్థాయలో ఆరోపణలు గుప్పించారు. సాయంత్రం ఆరు గంటల 10 నిముషాల ప్రసంగాన్ని మొదలు పెట్టి ఏడు గంటలకు ముగించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. అవినీతిని అంతమొందించేందుకు, సమాజాన్ని ప్రక్షాళన చేసేందుకు జనసేన వచ్చిందన్నారు. కాకినాడ సెజ్‌లో ఏరువాక చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు తిరిగి రైతులకిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు రైతులను జైళ్ళల్లో పెట్టించారని దుయ్యబట్టారు. కాకినాడలో రెల్లి కులస్థులకు కనీసం ఇళ్ళు కూడా కట్టించలేక పోయారన్నారు. కాకినాడ పోర్టులో అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఒక జెట్టీ అద్దెకు తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి పోర్టుకు యజమాని అయ్యారన్నారు. ప్రతీ ఉద్యోగి జీతం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే, టీడీపీ నాయకులు రూ. వేల కోట్లు పైరవీలతో సంపాదిస్తున్నారన్నారు. యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. వందల సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటిస్తూ కేవలం పదుల సంఖ్యలో భర్తీ చేస్తున్నారన్నారు. తన తండ్రి సీఎం కాబట్టి తానూ సీఎం కావాలని కోరుకుంటున్న జగన్ తరహా తనది కాదన్నారు. దశాబ్దాల అనుభవంతో నూతన రాజకీయాలకు సృష్టిస్తానన్నారు. దేశం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారన్నారు. ఆ త్యాగఫలాలు అందరికీ అందేలా కృషిచేయాలన్నారు. మహనీయుల త్యాగాలను వృథా కానివ్వనన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడే జన సైనికులకు, మబ్బుల్లా పరుగెత్తే పిడుగుల్లాంటి జనసేన అన్నదమ్ముల అభిమానానికి వందనాలు తెలియజేస్తున్నానని కవితాత్మక ధోరణితో ప్రసంగాన్ని మొదలు పెట్టి భారత్ మాతాకీ జై అంటూ ముగించారు. సమాజంలో చెడును అంతం చేసి, అవినీతిని పారదోలిన తర్వాత నిజమైన దీపావళి చేసుకుందామన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపే జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందన్నారు. వేదికపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు వున్నారు. పోలీసు బందోబస్తు నడుమ జనసేన బహిరంగ సభ సాగింది.