తూర్పుగోదావరి

ముద్రగడకు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, మే 24: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు లేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. మంగళవారం అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ కార్యకర్తల సమావేశం అల్లవరంలో మండల పార్టీ అధ్యక్షుడు దాట్ల గోపీరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుచేసి రుణాలు మంజూరు చేస్తోందన్నారు. ముద్రగడ కాపుల మధ్య రాజకీయాలు చేస్తున్నారన్నారు. అమలాపురం నియోజకవర్గంలోని పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో 13 వందల గృహాలు మంజూరయ్యాయని, గ్రామాల్లో కూడా త్వరలో గృహాలు మంజూరు కానున్నాయన్నారు. కో-ఆపరేటివ్ బ్యాంకు నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరయ్యాయని, స్థలం కూడా సిద్ధంగా ఉందని త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. అల్లవరం మండల కేంద్రంలో రూ. 98.81 లక్షలతో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్‌ను మంత్రి పరిశీలించారు. రానున్న వర్షాకాలానికి పోలీస్ స్టేషన్ భవనం పూర్తిచేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ప్రతి సోమవారం నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటుచేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషిచేస్తామన్నారు. అనంతరం అల్లవరం గ్రామ దేవతలైన శ్రీ చింతాలమ్మ, రాజ్యలక్ష్మి అమ్మవార్లను మంత్రి, ఎమ్మెల్యే దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుబ్బల మాతా కస్తూరి, జడ్పీటిసి వేగిరాజు వెంకటకృష్ణ ప్రవీణ, ఎఎంసి ఛైర్మన్ గునిశెట్టి చినబాబు, గుబ్బల సత్యనారాయణమూర్తి, బి సత్తిబాబు, కంకిపాటి సత్యవతి వీరబాబు పాల్గొన్నారు.