తూర్పుగోదావరి

కార్యకర్తలకు అన్ని పనులు చెప్పి చేయలేం: ఎమ్మెల్యే పులపర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, జూలై 17: ప్రతి విషయం కార్యకర్తలకు చెప్పి చేయాలంటే ఏ పనికి పూర్తిగా న్యాయం చేయలేమని పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అన్నారు. ఆదివారం ముక్తేశ్వరంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి కార్యకర్తలు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. స్థానిక కార్యకర్తలకు తెలియకుండా బయట కార్యకర్తల ద్వారా కొన్ని పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యేను నిలదీశారు. ఇటీవల తొత్తరమూడి గ్రామంలో ఒక వ్యక్తికి సిఎం రిలీఫ్ ఫండ్ కార్యకర్తలకు తెలియకుండా వచ్చిందన్నారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయడం సరికాదని, కార్యకర్తలకు అన్ని విషయాలు చెప్పి చేయలేమన్నారు. ఇటీవల కాపులు జరిపిన ఉద్యమాల్లో పార్టీ కార్యకర్తలు ఎవరూ దీటుగా ఎదుర్కొనలేక పోయారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇప్పటికైనా పార్టీకి నష్టం జరిగే ఏ కార్యక్రమాన్ని అయినా కార్యకర్తలు దీటుగా ఎదుర్కొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.