తూర్పుగోదావరి

మద్యం మత్తులో హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, జూలై 17: మద్యం సేవిస్తూ మత్తులో ఒకరికొకరు వాదోపవాదాలకు దిగి తూలనాడుకుంటూ వ్యక్తిగత విషయాలు లేవనెత్తడంతో పెరిగిన ఘర్షణ వాతావరణం ఒకరి హత్యకు దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 214 పక్క పండూరు జంక్షన్‌లో ఉన్న మద్యం దుకాణం వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పండూరు గ్రామానికి చెందిన వలవల దుర్గాజీ (30) అనే వ్యక్తి మృతిచెందాడు. దుర్గాజీ మద్యం దుకాణంలో మద్యం సేవిస్తుండగా పి వెంకటాపురానికి చెందిన విత్తనాల వీరవెంకట సత్యనారాయణ కూడా మద్యం సేవిస్తున్నాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మత్తులో ఉన్న వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సత్యనారాయణ దుర్గాజీ కుటుంబం గురించి తూలనాడడంతో దుర్గాజీ సత్యనారాయణపై కలియబడ్డాడు. దాంతో సత్యనారాయణ బీరుసీసాతో దుర్గాజీ మెడపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై దుర్గాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. దుర్గాజీ కులాంతర వివాహం చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిందితుడు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిజిహెచ్‌కు తరలించినట్టు తిమ్మాపురం ఎస్సై సత్యనారాయణ తెలిపారు.