క్రీడాభూమి

రాణించిన ఎడ్వర్డ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ గెలుపు
బెంగళూరు, మార్చి 17: మహిళల టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ విజయం 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ 60 పరుగులు సాధించి తమ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 153 పరుగులు సాధించింది. నతాలీ సివెర్ 27, టామీ బ్యూమోంట్ 18, కాతరీన బ్రంట్ 17 చొప్పున పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ జహానా ఆలమ్ 32 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చింది.
ఇంగ్లాండ్‌ను ఓడించేందుకు 154 పరుగులు సాధించాల్సిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు చేజార్చుకొని 117 పరుగులు చేయగలిగింది. నిగర్ సుల్తానా 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సల్మాన్ ఖటూన్ 32 (నాటౌట్), ఫోర్గాన్ హక్ 19, రుమానా అహ్మద్ 19 చొప్పున పరుగులు సాధించారు. రన్‌రేట్‌ను నిలకడగా పెంచుకోలేకపోయిన బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు. కాగా, శుక్రవారం ఐర్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 3 గంటలకు మొదలవుతుంది. రాత్రి 7.30 గంటలకు ఆరంభమయ్యే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఢీ కొంటాయి.