తెలంగాణ
కుటుంబ సభ్యులకు నిప్పంటించి కుమారుడి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
రంగారెడ్డి: ఇంట్లో నిద్రపోతున్న తల్లి, తమ్ముడు, చెల్లెలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు మండలం జినుగుర్తిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. మంటల ధాటికి తల్లి లక్ష్మి, చెల్లెలు జ్యోతి వెంటనే మృతి చెందగా, కిరోసిన్ వాసనతో మేల్కొని బయటకు పరుగుతీసిన తమ్ముడు చంద్రప్రకాష్ ప్రాణహాని నుంచి తప్పించుకున్నాడు. నిప్పంటించుకున్న నిందితుడు విజయ్కుమర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. చంద్రప్రకాశ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల కారణంగా తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని, తాను జైలు పాలైతే కుటుంబ సభ్యులు అవస్థలు పడకూడదన్న ఉద్దేశంతోనే విజయకుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.