ఆంధ్రప్రదేశ్‌

ఐదుగురు అదనపు ఎస్పీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి అర్భన్ ఎస్పీ కార్యాలయంలో ఉన్న డి.సిద్దారెడ్డిని డిజిపి కార్యాలయానికి, తిరుపతి అర్భన్‌లో ఉన్న ఎస్.త్రిమూర్తులును తిరుమలకు బదిలీ చేసింది. తిరుమలలో ఉన్న ఎంవిఎస్ స్వామిని తిరుపతి అర్బన్‌కు బదిలీ చేసి, రాజమండ్రి అర్భన్‌లో శాంతిభద్రతల విభాగంలో ఉన్న బి.శరత్‌బాబును నెల్లూరుకు, అక్కడ ఉన్న ఆర్.గంగాధర్‌రావును బదిలీ చేసి రాజమండ్రి శాంతిభద్రతలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది.
జర్నలిస్టులకు రూ.10 లక్షల సమగ్ర ప్రమాద బీమా
ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న జర్నలిస్టులకు రూ.10 లక్షల సమగ్ర జీవిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అందరికీ ఈ బీమా వర్తింప చేస్తామని మంత్రి చెప్పారు.