ఫ్లాష్ బ్యాక్ @ 50

అర్థరాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించారు పర్వతనేని గంగాధరరావు అనేకమంది స్నేహితులతో కలిసి ‘నవశక్తి ఫిలిమ్స్’పేరుతో హైదరాబాద్‌ళో తొలి తెలుగు చిత్రం ‘మా ఇంటి మహాలక్ష్మి’, మద్రాస్‌లో ‘కలిమి లేములు’ నిర్మించారు. ఆ తరువాత ‘హైదరాబాద్ మూవీస్’పేరిట ‘జల్సారాయుడు’(1960), పెళ్ళికాని పిల్లలు (1961), కీలుబొమ్మలు (1965) నిర్మించారు. 1967లో మొదలుపెట్టి 1968లో వీరు విడుదల చేసిన చిత్రం అర్ధరాత్రి. ఈ చిత్రంద్వారా తన తమ్ముడు పి.సాంబశివరావును దర్శకునిగా, నటీమణి భారతిని హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
1935లో ప.గో.జిల్లా ఏలూరులో జన్మించిన పర్వతనేని సాంబశివరావు, అన్న గంగాధరరావుగారి ప్రోత్సాహంతో మద్రాసు వచ్చి, తాపీ చాణుక్య, ఆదుర్తి సుబ్బారావు, సి.ఎస్.రావుల వద్ద దర్శకత్వపు మెళుకువలు నేర్చుకున్నారు. ఆరోజుల్లో హిందీ చిత్రాలు బీస్‌సాల్‌బాద్, కొహరా వంటి చిత్రాలు సక్సెస్ కావటంతో, ఆ తరహా చిత్రాన్ని తెలుగులో ‘అర్ధరాత్రి’గా వీరి దర్శకత్వంలో రూపొందించారు.
ఆ తరువాత వీరు పలు తెలుగు, 2 హిందీ, ఒక బెంగాలి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అర్ధరాత్రి చిత్రానికి కథ- ఆరుద్ర, మాటలు- పాలగుమ్మి పద్మరాజు, సంగీతం- మాస్టర్ వేణు, కళ-రాజేంద్రకుమార్, నృత్యం- చిన్ని సంపత్, స్టంట్స్- రాఘవులు అండ్ పార్టీ, కూర్పు-వీరప్ప, దర్శకత్వం- పి.సాంబశివరావు.
ధనవంతుడు, విద్యావంతుడు, గుణవంతుడు అయిన వ్యక్తి శ్రీ్ధర్ (జగ్గయ్య) అతని బంగళాలో 6గురు నౌకర్లు సిద్దయ్య (చదలవాడ), నరసింహం (సీతారాం), ముత్యాలు పొట్టిప్రసాద్, చిడతల అప్పారావు, మోదుకూరి సత్యం పనిచేస్తుంటారు. ప్రతి రాత్రి ఆ బంగళా ఔట్‌హస్ నుంచి అర్ధరాత్రి ఓ విషాద గీతం వినబడుతుంటుంది. నౌకర్లు, దాన్ని దయ్యాల బంగళా అంటుంటారు. మేనమామ పెరుమాళ్ళు, ఇంట తల్లి, తండ్రి మరణించటంచేత ఆశ్రయం పొందిన సరళ (్భరతి) మేనత్త నిర్మల ఆరళ్ళు తట్టుకోలేక ఇల్లువదిలి వెళుతుంది. శ్రీ్ధర్, కారుక్రింద పడుతుంది. డా.రమేష్ హాస్పిటల్‌లో వైద్యం పొందాక, డాక్టరు సలహాతో ఎవరూ లేని అనాధ అని సరళను తన బంగ్లాకు తీసుకువస్తాడు శ్రీ్ధర్. పనివాళ్ళను అదుపులోపెట్టి, ఇంటిని చక్కదిద్దటమేకాక శ్రీ్ధర్ అభిమానం, అనురాగం పొందుతుంది సరళ. శ్రీ్ధర్ మేనమామను అని పానకాలరావు (రమణారెడ్డి) అతని కూతురు చిత్ర ( ) బావా అంటూ వరసలు కలిపి శ్రీ్ధర్‌ను పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. బంగళాలో ప్రతీ రాత్రి విషాద గీతం వినగానే శ్రీ్ధర్ వెళ్ళి ఔట్‌హౌస్‌లో ఓ స్ర్తితో పెనుగులాడడం, శ్రీ్ధర్ బాధ సరళ గమనిస్తుంటుంది. ఔట్‌హౌస్‌లోకి వెళ్ళబోయిన సరళను ఒకసారి, రౌడీ జగ్గారావు, మరొకసారి శ్రీ్ధర్ అడ్డుకుంటారు. పార్టీలో తాగిన మైకంలో వచ్చిన శ్రీ్ధర్ మంచంను ఒక స్ర్తివచ్చి తగలబెట్టబోగా, సరళ రక్షిస్తుంది. సరళను వివాహం చేసుకుంటానని, నగలు, చీరలు తెచ్చి శ్రీ్ధర్ ఇవ్వగా, ఆ రాత్రి మరోసారి ఒక స్ర్తి వాటిని చింపివేసి, నాశనం చేస్తుంది. చివరకు అన్ని సర్దుకుని సరళ, శ్రీ్ధర్‌లు వివాహం జరగబోతుండగా, కేశవ్ (రావికొండలరావు), పోలీసులతో వచ్చి ఈ పెళ్ళి జరగరాదు, శ్రీ్ధర్, వివాహితుడని, తన చెల్లెలు రాణిని పెళ్ళాడాడని తెలియచేస్తాడు. శ్రీ్ధర్, సరళను ఔట్‌హౌస్‌కి తీసుకువెళ్ళి అందరి సమక్షంలో గతం తెలియచేస్తాడు. కేశవ్ చెల్లెలు, ప్రసాద్ (బాలయ్య)ను ప్రేమించగా, వ్యసనపరుడు దుష్టుడు అయిన కేశవ్ అతన్ని హత్యచేసి, ఆ నేరం శ్రీ్ధర్ తండ్రి ధర్మారావు (నాగయ్య) మీదకు నెట్టి, అతన్ని బంధించి, మోసంతో రాణికి శ్రీ్ధర్‌కు పెళ్ళి జరిపిస్తాడు. ప్రసాద్ మరణంతో పిచ్చిదయిన రాణిని ఔట్‌హౌస్‌లో వుంచి వైద్యం చేయిస్తున్నానని, కేశవ్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, డాక్టరు, కోర్టుఇచ్చిన ఉత్తర్వు ప్రకారం సరళను పెండ్లి చేసుకోబోయానని తెలియచేస్తాడు. పోలీసులు ధర్మారావును అరెస్ట్‌చేయటం, పెళ్ళి ఆగిపోవటం, కేశవ్, తన చెల్లెలు రాణి వున్న ఔట్‌హౌస్‌కి నిప్పుపెట్టడం, ఆ మంటల్లో మతి స్థిమితం వచ్చిన రాణి, ప్రసాద్‌ను తన అన్న చంపాడని నిజంచెప్పి మరణించటం, సరళ, శ్రీ్ధర్‌ల వివాహం, తండ్రి ధర్మారావు సమక్షంలో జరగటంతో చిత్రం సుఖాంతం అవుతుంది.
ఈ చిత్రంలో దర్శకులు చక్కని టెంపోతో కథను నడిపారు. ఔట్‌హౌస్ నుంచి పాట విన్పించాక, ఓ స్ర్తితో శ్రీ్ధర్ పెనుగులాట, శ్రీ్ధర్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ జగ్గారావు కత్తితో వుండడం, అలాగే సరళను, గమనించటం, కేశవ్‌వద్ద నుంచి తప్పించుకున్న ధర్మారావు, కొడుకు శ్రీ్ధర్‌ను కలవబోవటానికి తోటలోకి రావటం, జగ్గారావును చూచి తప్పుకోవటం, చిత్ర ప్రారంభంలో సరళను కలవబోయిన ధర్మారావుకు జడిసి, ఆమె శ్రీ్ధర్ కారుక్రింద పడడం బంగళా తలుపులు సరిగా వేయనపుడు శ్రీ్ధర్ మంచంవద్ద మంటలు, మరొకసారి సరళ వస్తువులు పాడుచేయటం సస్పెన్స్‌ను చక్కగా మెయిన్‌టెయిన్ చేశారు. శ్రీ్ధర్ మరో పెళ్ళికి అడ్డులేదని వై.వి.రావుతో చెప్పించటం, అది ఏమిటో చివర వెల్లడి చేయటం, ఇక చిత్రాన్ని సరళ, శ్రీ్ధర్‌లమధ్య మాటలు చాలా తక్కువగా కేవలం చూపుల ద్వారా, చర్యలకు రియాక్షన్, భోజనానికి రాగా, శ్రీ్ధర్ కాళ్ళకేసి చూడగా, చెప్పులు విడిచి రావటం, మరోసారి భోజనానికి వస్తానని ఫోనుచేసి, భోజనానికి కూర్చోబోతుండగా చిత్ర రాగానే శ్రీ్ధర్ వెళ్ళిపోవటం సరళ దుఃఖించటం, చిత్రను పంపివేసి, శ్రీ్ధర్ తిరిగిరాగా ఆనందం. ఎన్నో చిన్నచిన్న సన్నివేశాల్లో, ఎంతో అర్ధవంతంగా ఓ వెరైటీగా చిత్రీకరించారు.
సరళ మేనత్త ఇంట్లోనూ, అదే విధంగా వౌనంగా వుండడం, ఒక్కసారి ఎదురుమాట్లాడి, ఇల్లు వదలటం, వెళ్ళేటప్పుడు పంజరంలోని చిలుకను వదిలివేయటం, ఆ సందర్భంలో గీతం ‘ఎగిరిపోయిన చిలుక ఎచటవాలునో ఎవరికెరుక’ (ఎల్.ఆర్.ఈశ్వరి, అప్పారావు- రచన ఆరుద్ర) దారిలో చెట్టుకు చిక్కుకున్న గాలిపటాన్ని వదిలించటం సింబాలిక్‌గా చిత్రీకరణ సాగటం. ఇక చిత్రం చివరలో కేశవ్ ఇల్లు తగలబెట్టటం, ఆపటానికి వచ్చిన శ్రీ్ధర్‌పై కాగడాలతో దాడిచేయటం, శ్రీ్ధర్ దాన్ని తప్పించుకోవటం, రాణికి అన్న ప్రసాద్‌ను చంపటం గుర్తురావటంతో తెలివిరావటం, దూలం కాలి ఆమెపై పడి మరణించబోతూ, నిజం వెల్లడించటం, అలాగే నౌకర్ల మనస్తత్వాలు ఎంతో తమాషాగా శ్రీ్ధర్‌కు కాఫి ఇవ్వటం ద్వారా చూపటం. జగ్గయ్య, భారతి ఇరువురి నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం రావికొండలరావు నట జీవితంలో ఓ వెరైటీ విలన్ పాత్రగా నిలవటం విశేషాంశం.
ఈ చిత్రంలోని ఇతర గీతాలు ‘‘నౌకర్లు, కూరగాయలమ్మితో పాట’’ , ‘తిరిగి పోతే రాదు తీయనిమ్మపండు’ (లత బృందం- రచన కొసరాజు). చిత్ర, శ్రీ్ధర్‌ను కవ్విస్తూ పాడే గీతం-‘‘కైపెక్కించే కమ్మని రేయి, కనులు కలిపితే కాదనకోయి’’ (ఎస్.జానకి- దాశరథి). మరో గీతం ‘ఓహో అందమంతా నా సొమ్మే అయినా నేను మాత్రం’(ఎల్.ఆర్.ఈశ్వరి- ఆరుద్ర). ఈ చిత్రంలోని ‘హాయి’అయిన హాటింగ్ గీతం తొలుత బాలయ్య, రాణి (కల్పన)లపై చిత్రీకరించగా ఆ తరువాత ప్రతి రాత్రి 12 గంటలకు కన్పించటం. ‘ఈ పిలుపు నీకోసమే, నా మమత నీకోసమే వేయి జన్మలనుండి, వేయి కన్నులు తెరచి వెదికేది బ్రతికేది నీకోసమే’ విరబూజి పూవువై విరిసి, నిను చేరి నాను’(పి.సుశీల- రచన ఆరుద్ర) అర్ధరాత్రి చిత్రంలో నాయకా, నాయికలపై ఎక్కడా ఒక పాట లేకపోవటం, ఈ పాట మాత్రం, ఈ చిత్రాన్ని గుర్తుచేస్తూ నిలవటం విశేషం. ఈ చిత్రం ద్వారా, భారతి తొలి చిత్రమే అయినా ఎంతో పరిణితితో, తన చూపులతో చక్కని భావాలు పలికించి, ఆ తరువాత మరెన్నో చిత్రాలతో, ఉన్నతస్థానానికి ఎదిగారు. ఓ చక్కని ప్రయోగానికి నిదర్శనంగా, ఫలితాలు లెక్కించక వెరైటీగా నిలిచిన చిత్రం అర్ధరాత్రి అనుకోవాలి.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి