ఫోకస్

గవర్నర్లు.. వివాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగం సర్వోన్నతమైంది. భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అయినంతగా మరేదీ కాలేదు. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ ప్రతినిధిగా పనిచేయాలనేది రాజ్యాంగ స్ఫూర్తి, అయితే కొంతమంది కేంద్రంలోని అధికార పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తూ రాష్ట్రప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్ష పార్టీలను అన్యాయంగా బర్త్ఫ్ చేయడం వంటి పరిణామాలతో గవర్నర్ల వ్యవస్థ తీవ్రమైన విమర్శలనే ఎదుర్కొంటోంది. రాజ్యాంగంలోని ఆరో భాగం ప్రకరణ 152 నుండి 167 వరకూ గవర్నర్ల నియామకం, పదవీ కాలం, అర్హతలు, అధికార విధులు గురించి స్పష్టంగా పేర్కొంది. ప్రకరణ 155 ప్రకారం రాష్టప్రతి గవర్నర్లను నియమిస్తారు. అయితే ప్రకరణ 156(1) ప్రకారం రాష్టప్రతి విశ్వాసం ఉన్నంతవరకే గవర్నర్ ఆ పదవిలో కొనసాగుతారు.
గవర్నర్ల అధికారాలు, పరిధి, విస్తృతి అంశాలపై దేశవ్యాప్తంగా మరోమారు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా పనిచేస్తుండగా, గవర్నర్లు రాష్టన్రేతగా వ్యవహరించడం రాజ్యాంగ విధి. భారత రాష్టప్రతికి ప్రతినిధిగా ఐదేళ్ల కాలవ్యవధికి రాజ్యాంగంలోని 157వ అధికరణ కింద గవర్నర్ల నియామకం జరుగుతుంది. క్షమాభిక్ష అధికారాలు, కమిషన్ల నియామకాలు, విశ్వవిద్యాలయాల విసిల నియామకాలతోపాటు కార్యనిర్వాహక అధికారాలు పరిపాలన, నియామకాలు, తొలగింపులు, శాసనాధికారాలైన రాష్ట్ర శాసనసభ, శాసనమండలి , పబ్లిక్ సర్వీసు కమిషన్లకు సంబంధించి విస్తృతమైన అధికారాలే గవర్నర్‌కు ఉంటాయి. వీటికిమించి గవర్నర్లకు విచక్షణాధికారాలు కూడా ఎక్కువే. ఒక గవర్నర్ రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించే అధికారం కూడా రాజ్యాంగంలో ఏడో సవరణ ద్వారా అవకాశం కల్పించారు. గవర్నర్ల పాత్ర ఎంత వివాదాస్పదమో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు ఉన్నపుడు అంతా చూశారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనూ గవర్నర్ల పాత్రను తప్పుపడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అసాధారణమైందే. గవర్నర్ల పాత్ర ఎంత విస్తృతంగా కనిపించినా, అది ఎంత పరిమితం అయిందో రాజ్యాంగ పీఠం స్పష్టంగా పేర్కొంది. మంత్రివర్గాలకు బదులు గవర్నర్లు నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కూడా కుదరదని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం భారతదేశంలో కొత్తకాదు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి లెక్కవేస్తే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, కేంద్ర పాలన విధించిన ఉదంతాలు వందకుపైగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని 1994లో బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైన తీర్పునే ఇచ్చింది. రాజకీయ పార్టీల అంతర్గత గొడవలకు దూరంగా ఉండాలని, ఆ వివాదాలు గవర్నర్‌కు సంబంధించినవి కావని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. రాజకీయ కుట్రలకు, ఫిరాయింపుల ప్రోత్సాహానికి పాల్పడకూడదని కూడా చెప్పింది. అయినా చాలామంది గవర్నర్లపై కేంద్రం ఏజెంట్లనే ముద్ర తొలగిపోలేదు. ఈ అంశంపైనే కొంత మంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.