ఆంధ్రప్రదేశ్‌

గడ్డిపాకలకు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారులు సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మలక్ష్మిపురం, జనవరి 22: గడ్డిపాకలకు నిప్పంటుకోవడంతో ఇద్దరు చిన్నారులు సజీవ దహనమైన దారుణం విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగింది. గ్రామస్థులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం తాడికొండ గిరిజన గ్రామం సమీపంలోని పొలాలకు కాపలాగా ఏర్పాటు చేసిన గడ్డిపాకల వద్దకు శుక్రవారం అడ్డాకుల రాజేష్ (3), తాడంగి త్రిషిక్‌కుమార్ (3) ఆడుకునేందుకు వెళ్లారు. ఆకస్మికంగా గడ్డిపాకలకు నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగి, చిన్నారులు తప్పించుకోలేక అగ్నికీలలకు ఆహుతై సజీవ దహనం అయ్యారు. మధ్యాహ్నం అటుగా వెళ్లిన యువకులకు కాలిన గడ్డిపాకల దగ్గర ఇద్దరు చిన్నారుల కాలిన మృతదేహాలు కనబడటంతో విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి రెవెన్యూ, పోలీసు సిబ్బంది వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు.