రాష్ట్రీయం

గణతంత్ర క్రీడల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 23: గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని జరుగుతున్న ఆటల పోటీల్లో అపృశృతి చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జూలూరుపాడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఖోఖో ఆడుతుండగా ఇద్దరు తోటి ఆటగాళ్లు బలంగా తగలడంతో 7వ తరగతి విద్యార్థి భద్రాచలం స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు కొత్తగూడెంకు తరలించారు. వైద్య సేవలు అందించినప్పటికీ పరిస్థితి విషమించి భద్రాచలం మృత్యువు పాలయ్యాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేనప్పటికీ ఆటల పోటీలు నిర్వహించటంతో పాటు యజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు ఎంఈఓ వెంకటయ్యలు సందర్శించారు.