రాష్ట్రీయం

గాంధీ ఆస్పత్రిలో కిడ్నీ విభాగం సిల్వర్ జూబ్లీ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో కిడ్నీ విభాగం సిల్వర్ జూబ్లీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని తెలిపారు. మూత్రపిండ సంబంధిత వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.గాంధీ ఆస్పత్రిలో కిడ్నీ విభాగంలోని వైద్యుల పనితీరు బాగుందని ప్రశంసించారు. ఈ విభాగం అధిపతి డాక్టర్ మంజూష, ఆమె టీమ్‌ని మంత్రి అభినందించారు. ఈ వేడుకల్లో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మంజుల, లండన్ నుంచి వచ్చిన కిడ్నీ వ్యాధుల నిపుణులు, గాంధీ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.