ఆంధ్రప్రదేశ్‌

శిశువు బతికున్నా.. ప్రాణం పోయిందన్నారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అప్పుడే పుట్టిన శిశువు బతికే ఉన్నా.. మరణించినట్లు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు చెప్పడం వివాదాస్పదమైంది. గుంటూరు శివారు ప్రాంతానికి చెందిన ఓ మహిళ మంగళవారం ఉదయం జిజిహెచ్‌లో ప్రసవించగా శిశువు మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అయితే, కొంతసేపటికి శిశువులో కదలిక రావడంతో బాలింత బంధువులు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో వైద్యులు ఆ శిశువును ఐసియులో ఉంచి చికిత్స ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే ఆయన ‘శిశువు మరణించినట్లు చెప్పిన వైద్యులు ఎవర’ని ఆరా తీశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.