గుంటూరు

ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఏప్రిల్ 17: ఎన్నికల్లో పేద, మధ్య తరగతి ప్రజలు రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు ఆదివారం అచ్చంపేటలో జరిగిన విలేఖర్ల సమావేశంలో అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ సామాజికవర్గాల ప్రజలతో ఎన్నికల వాగ్దానాలను ప్రభుత్వానికి గుర్తుచేస్తూ బస్సుయాత్ర నిర్వహించామన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 20న గుంటూరు మహిమాగార్డెన్స్‌లో ప్రజావేదిక సదస్సును కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందన్నారు. ఈ సభకు కేంద్ర, రాష్ట్ర ప్రధాన నాయకులైన మీరాకుమారి, కొప్పుల రాజు, పల్లంరాజు, కెవిపి రామచంద్రరావు, చిరంజీవి, జెడి శీలం తదితరులు విచ్చేస్తారని తెలిపారు. సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ చంద్రయ్య, కె వీరబాబు, టి ఆంజనేయులు, ఎస్ శ్రీను, వై రాంబాబు, పసుపులేటి వెంకట్రామయ్య, ఎస్‌కె మస్తాన్‌వలి తదితరులున్నారు.