గుంటూరు

గుంటూరు యువకుని అవయవదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, ఏప్రిల్ 17: తాడేపల్లి పట్టణంలోని మణిపాల్ ఆసుపత్రిలో ఆదివారం అవయవదానం జరిగింది. గుంటూరు నెహ్రూనగర్‌కి చెందిన అశోక్ అనే యువకుడు గత మంగళవారం కోమాలోకి వెళ్ళగా అతనికి వైద్యపరిక్షలు చేసిన మణిపాల్ వైద్యులు అశోక్‌కి బ్రెయిన్‌డెడ్ సంభవించినట్లు ధ్రువీకరించారు. అశోక్ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలు ఇతరులకు అమర్చటానికి జీవన్‌ధాన్‌ని సంప్రదించారు. దీనితో మణిపాల్ వైద్యబృందం అవసరమైన ప్రక్రియ ద్వారా అవయవాలను పరిక్షించి, వాటిలో లివర్‌లని. ఒకకిడ్నీ, మణిపాల్‌లోని ఇద్దరు రోగులకు అమర్చగా, అశోక్ కళ్లను శంకర కంటి ఆసుపత్రికి, మరొక కిడ్నిని ఆయుష్ ఆసుపత్రికి మణిపాల్ వైద్యులు తరలించారు.