గుంటూరు

గోవాడ వద్ద పెయింటర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతలూరు, ఏప్రిల్ 26: అమృతలూరు మండలం గోవాడ వద్ద పెయింటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతిదారుణంగా గొంతుకోసి హత్యచేసి రోడ్డువెంట పడవేసి వెళ్ళిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని పెదపూడి గ్రామానికి చెందిన తెనాలి సురేష్ (60) పెయింట్ పనిచేస్తూ భార్యాబిడ్డలతో జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం గా అమృతలూరు గ్రామంలో మరో మ హిళతో వివాహేతర సంబంధం పె ట్టుకున్నాడు. అమృతలూరులోని మహిళ కోసం నూతనంగా నిర్మించే గృహానికి సంబంధించిన సమగ్రిని చెరుకుపల్లిలో కొని తన అల్లునికి చెందిన ఆటోలోవేసి పంపాడు. ఆ తరువాత తాను తన సొంత బైకుపై గోవాడకు వస్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు సురేష్ వాహనాన్ని ఆపి అతిదారుణంగా గొంతుకోసి పరారయ్యా రు. తీవ్ర రక్తస్రావంతో సురేష్ అక్కడి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. చుండూరు సిఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో గుంటూరు నుండి క్యూస్‌టీమ్, డాగ్ స్వ్కాడ్ హత్యజరిగిన ప్రదేశానికి చేరుకుని సురేష్ మృతదేహాన్ని పరిశీలించి భౌతిక ఆధారాలు సేకరించారు. ఈసంఘటనపై కేసు నమోదుచేసినట్లు, నిందితులను త్వరలో పట్టుకుంటామని సిఐ సురేష్‌బాబు చెప్పారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్త మృతదేహాన్ని తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.