గుంటూరు

ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, అక్టోబర్ 20: దీపావళి పండుగకు వచ్చి స్నేహితులతో కలిసి తినుబండారాలు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి వెళ్లి కాలుజారి చెరువులో పడి ఇంజనీరింగ్ విద్యార్థి మణికంఠ మృతిచెందిన సంఘటన మండలంలోని ఇనిమెట్ల సమీపంలో చెరువు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న మణికంఠ దీపావళి సెలవుకు వచ్చి స్నేహితులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.