గుంటూరు

అమరేశ్వరుని సేవలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం పద్మ శుక్రవారం పుణ్యక్షేత్రమైన అమరావతిని సందర్శించారు. అమరేశ్వరాలయానికి విచ్చేసిన అధికారిణి పద్మకు ఆలయ అధికారులు పూలమాలలు వేసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, మేళతాళాలతో ఆలయంలోకి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి శేషవస్త్రాలు బహూకరించి, తీర్ధప్రసాదాలు అందజేశారు. అలాగే అమరావతిలో ఉన్న ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పురావస్తు ప్రదర్శనశాలలను కూడా సందర్శించారు. ఆమె వెంట జిల్లా అధికారి నారాయణుడు కూడా పాల్గొన్నారు.