గుంటూరు

లింగారావుపాలెంలో వరుస చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, మే 17: మండల పరిధిలోని లింగారావుపాలెంలోని నాలుగు గృహాల్లో ఒకేరోజు చోరీలు జరిగాయి. ఇద్దరు యజమానులు తమ వారిని అమెరికా పంపేందుకు హైదరాబాదు వెళ్లగా మరో రెండు కుటుంబాల వారు షిరిడియాత్రలో ఉన్నారు. ఆదివారం రాత్రి జరిగి ఉండవచ్చని గ్రామస్థులు, పోలీసులు భావిస్తున్న ఈ చోరీలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. ఉదయం పనిమనిషి ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి పక్కవారికి తెలియజేయడంతో మిగిలిన ముగ్గురు ఇళ్లను కూడా పరిశీలించగా వరుస దొంగతనాలు జరిగినట్లు తెలిసింది. వీరి బంధువులు 7 లక్షల మేర సొత్తు చోరీకి గురై ఉంటుందని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం కుటుంబ యజమానులు వచ్చి చోరీ సొత్తు విలువ చెప్పిన తరువాతే పరిగణనలోకి తీసుకుంటామంటున్నారు. చిలకలూరిపేట రూరల్ సిఐ శోభన్‌బాబు, యడ్లపాడు ఎస్‌ఐ రమేష్‌బాబు మంగళవారం నాలుగు గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు జాగిలాలను తెప్పించా రు. అయితే తక్షణ ఫలితం కనిపించలేదు. కుటుంబ యజమాను లు వచ్చిన తరువాత గానీ దర్యాప్తు ఊపందుకోద ని పలువురు భావిస్తున్నారు.